Purandeshwari: ఏపీ బిజెపి అధ్యక్షురాలుగా పురందేశ్వరి బాధ్యతలు తీసుకోవడం వెనుక బిజెపి వ్యూహం ఏంటోనని మొదట అర్థం కాలేదు అయితే బిజెపి ప్రభుత్వం ఏదో ఒక వ్యూహాన్ని రచించి ఈమెను ఏపీ బీజేపీ అధ్యక్షురాలుగా నియమించారని మాత్రం స్పష్టంగా అర్థం అవుతుంది అయితే ఈమె బీజేపీ అధ్యక్షురాలిగా ఎన్నికైన తర్వాత మొదటిసారి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యలు బట్టి చూస్తుంటే అధ్యక్షురాలుగా నిలబెట్టడం వెనుక బిజెపి వ్యూహం ఏంటో అర్థం అవుతుంది.
ఈ సందర్భంగా పురందేశ్వరి మీడియా సమావేశంలో మాట్లాడుతూ జగన్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. దీంతో బిజెపి వ్యూహం బయటపడింది.ఏపీలో లిక్కర్ స్కామ్ జరుగుతోందని నాణ్యతలేని మద్యం అమ్మటం వల్ల ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారని ఈమె మాట్లాడారు బిల్లులు మాత్రం బయటకు రాలేదని అవన్నీ కూడా తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ కు వెళ్తున్నాయని పురందేశ్వరి ఆరోపణలు చేశారు.
ఇక ఇసుక మాఫియా కూడా జరుగుతుందని పురందేశ్వరి తెలిపారు.ఇక కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన నిధులు అన్ని ఎక్కడ అంటూ ఈమె జగన్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ విధంగా సమావేశంలో కేవలం జగన్ ప్రభుత్వాన్ని ఆయనను టార్గెట్ చేస్తూ మాట్లాడడమే కాకుండా తెలుగుదేశం ప్రభుత్వం గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు దీంతో టిడిపి బిజెపి పొత్తు ఖాయమని క్లారిటీ వచ్చింది. అదేవిధంగా జనసేన పార్టీతో రేపు కూడా అదే విధంగా ముందుకు వెళ్తామని ఈమె తెలిపారు.