Apsara Rani: వైరల్ అవుతున్న అప్సరా రాణి షాకింగ్ కామెంట్స్!

Apsara Rani:సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన థ్రిల్లర్ మూవీలో హీరోయిన్‌గా అప్సరా రాణి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాలో తన నటన, అందాలతో కుర్రకారును ఉర్రూతలూగించింది. అలాగే రవితేజ హీరోగా నటించిన ‘క్రాక్’ సినిమా, డేంజరస్ సినిమాలో ఐటెం సాంగ్‌లో అలరించింది. తన అందాలను ఆరబోస్తూ.. యువతను పిచ్చెక్కిస్తోంది. ఈ హాట్ బ్యూటీ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటుంది. బోల్డ్ గా కనిపిస్తూ.. సె..క్సీ అందాలను ఆరబోస్తూ అందరినీ మత్తెక్కిస్తూ ఉంటుంది. ఎప్పుడు తన హాటో ఫోటోలను షేర్ చేస్తూ.. క్రేజీగా ఫాలొయింగ్‌ను పెంచుకుంటోంది.

 

 

ప్రస్తుతం ఈ భామ రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో ‘డేంజరస్’ సినిమాలో నటిస్తోంది. సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌లో భాగంగా అప్సరా రాణి పలు షోలు, ఇంటర్వ్యూల్లో పాల్గొంటోంది. తాజాగా ఆమె ఓ మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ ఇంటర్వ్యూలో ఆమె సంచలన వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం ఆమె చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి. ఈ సందర్భంగా అప్సర రాణి మాట్లాడుతూ.. ‘సినిమాల్లో అవకాశాల కోసం మొదటగా కన్నడ ఇండస్ట్రీలో ట్రై చేశారు. సినిమాల వేటలో ఉన్నప్పుడు ఓ స్టార్ డైరెక్టర్ అవకాశం ఇస్తానని చెప్పాడు. సినిమాపై డిస్కషన్ చేయడానికి నన్ను ఒక్కదాన్నే గదికి రమ్మనాడు. అప్పుడు నాకు భయమేసి.. మా నాన్నను కూడా వెంట తీసుకుని వెళ్లాను. నాన్నను ఇంటి బయట నిలబెట్టి.. నేను లోపలికి వెళ్లాను. లోపలికి వెళ్లిన తర్వాత నా చేయి పట్టుకుని లాగాడు. నిన్ను హీరోయిన్‌గా చేయాలంటే నాతో పడుకోమని చెప్పాడు. నాకు పరిస్థితి అర్థమై.. గట్టిగా అరచి బయటికి పారిపోయాను. ఆ తర్వాత టాలీవుడ్‌లో ఆఫర్లు వచ్చాయి. ఇన్నేళ్లల్లో టాలీవుడ్‌లో ఎలాంటి చేదు అనుభవం ఎదురుకాలేదు.’ అని ఎమోషనల్‌గా మాట్లాడింది.

 

కాగా, డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తన సినిమాల విడుదలకి ముందు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం, ట్విట్స్ పెట్టడం కామన్‌గా జరుగుతూ ఉంటుంది. తనకు నచ్చిన సినిమాలు చేస్తూ విడుదల చేస్తుంటారు. ‘డేంజరస్’ సినిమాలో ఇద్దరు లెస్బియన్ పాత్రలను హైలెట్ చేస్తూ సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌కు ముందు ఇంటర్వ్యూలు, షోలు నిర్వహిస్తూ ఎప్పుడూ వివాదాల్లో నిలుస్తున్నారు. నెగిటివ్‌గా రూమర్స్ స్ప్రెడ్ చేస్తూనే సినిమా ప్రయోషన్లు చేసి వార్తల్లో నిలుస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -