RGV: పవన్ పై ఆర్జీవీ సంచలన ట్వీట్.. పవన్ కళ్యాణ్ పరువు తీస్తూ?

RGV: దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈమధ్య ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలపై ఒక కన్ను వేశాడు. టీడీపీ, జనసేన పార్టీలపై సోషల్ మీడియా వేదికగా టార్గెట్ చేస్తున్నాడు. తరచూ నారా లోకేష్, చంద్రబాబు లపై సెటైరికల్ ట్వీట్స్ చేస్తున్నాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ని కూడా టార్గెట్ చేశాడు. వారాహి యాత్రలో పవన్ చేస్తున్న కామెంట్స్ పై స్పందిస్తూ గ్రామ వాలంటీర్లను పవన్ పైకి రెచ్చగొట్టేలాగా మాట్లాడుతున్నాడు.

ఆర్జీవికి కోపం తెప్పించేటంతగా పవన్ ఏం మాట్లాడాడో చూద్దాం. ఏలూరు సభలో వాలంటీర్లు ప్రతి గ్రామంలోని ఎవరు ఎవరి మనిషి ఏ కుటుంబంలో ఎంతమంది ఉన్నారు లేదా అని వివరాలని సేకరించి సంఘవిద్రోహ అస్సతులకి చేరవేస్తున్నారు వాలంటీర్లు హ్యూమన్ ట్రాఫిక్ కిందికి పాల్పడుతున్నారు అని దారుణ విమర్శలు చేశారు. ఈ వ్యాఖ్యలపై రాంగోపాల్ వర్మ తనదైన స్టైల్ లో కౌంటర్ ఇచ్చారు.

 

వాలంటీర్లకు సిగ్గు, శరం ఆత్మాభిమానం అంటూ ఉంటే పవన్ పై క్రిమినల్ కేసు పెట్టాలని డిమాండ్ చేశారు. ప్రజల కోసం పనిచేసే వైసీపీ వాలంటీర్లని.. పవన్ కళ్యాణ్ అమ్మాయిల బ్రోకర్లని అన్నాడు. అంతా నీ జాతి నీచంగా అసహ్యంగా వర్ణించబడ్డ ఆ వాలంటీర్లకి సిగ్గు, శరం ఉంటే వెంటనే పవన్ కళ్యాణ్ మీద క్రిమినల్ కేసులు పెట్టాలి లేకపోతే వాళ్ళ ఇంట్లో వాళ్లకి మొహాలు ఎలా చూపెట్టగలరు..

 

అయినా వైసీపీ ప్రభుత్వం మహిళల ట్రాఫికింగ్ చేస్తుంది అనే పవన్ కళ్యాణ్ ఆరోపణ చరిత్రలో ఇప్పటివరకు ఎవరు ఎవరిమీద చేసిన ఆరోపణలన్నింటికీ పరాకాష్ట. సెంట్రల్ ఇంటెలిజెన్స్ వాళ్ల దగ్గర ఈ విషయం గురించిన ఆధారాలు ఉంటే యాక్షన్ తీసుకోకుండా పవన్ కళ్యాణ్ చెవిలో ఎందుకు చెప్తారు అంటూ నిలదీశారు. పవన్ కళ్యాణ్ పరువు తీసేలా ఆర్జీవి చేసిన ఈ ట్వీట్ ఎంత దూరం వెళ్తుందో చూడాలి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: జగన్ అధికారంలోకి వస్తే ఏపీ ప్రజల భూములు పోతాయా.. బాబు చెప్పిన విషయాలివే!

Chandrababu Naidu: జగన్ మరొకసారి అధికారంలోకి వస్తే ప్రజల భూములను అధికారికంగా కబ్జా చేస్తారని భయం ప్రజల్లో పట్టుకుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి తీసుకువచ్చిన భూ యాజమాన్య హక్కు చట్టం కబ్జాదారులకు అక్రమార్కులకు...
- Advertisement -
- Advertisement -