ఆ మధ్యనే గోల్డెన్ గ్లోబల్ అవార్డు కూడా సొంతం చేసుకోగా.. ఇప్పుడు ఆస్కార్ నామినేషన్ లో కూడా ఉంది. ఇక హాలివుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ 5 అవార్డులను కూడా ప్రకటించింది. ఇక హెచ్సిఏ ఈవెంట్లో స్పాట్ లైట్ అవార్డు కూడా మూవీ టీం మొత్తానికి అందజేశారు. అయితే ఈవెంట్ కు రామ్ చరణ్ ఒక్కడు వెళ్లడంతో ఆయనకు అందరు తరుపున అవార్డును అందించారు.
దీంతో చాలామంది ఆ అవార్డు రామ్ చరణ్ ఒక్కడికే ప్రకటించినట్లు ప్రచారం చేస్తున్నారు. అయితే అవార్డు సినీ బృందానికి మొత్తానికి అందుతుంది. అయితే ఈ నేపథ్యంలో తాజాగా యాంకర్ శ్యామల చేసిన ట్వీట్ ప్రస్తుతం వివాదాస్పదంగా మారింది. ఇక అవార్డు కేవలం రామ్ చరణ్ అందరి తరపున అందుకున్నాడు అంతే.. అందుకే పెద్దగా ఎవరు అభినందనలు తెలుపట్లేదు.
దీంతో శ్యామల.. రామ్ చరణ్ అవార్డు అందుకున్న ఫోటోలను షేర్ చేస్తూ.. ఇప్పుడు ప్రపంచం మొత్తం రామ్ చరణ్ పేరు మారుమోగుతుంటే.. సినిమా కులం మాత్రం ఆయన మీద ఈర్షతో పట్టించుకోవట్లేదు అని ట్వీట్ చేసింది. ఇక ఆమె చేసిన ట్వీట్ వైరల్ అవ్వటంతో చాలామంది దానిని కాంట్రవర్సీగా బయటికి తీశారు. ఆ అవార్డు రామ్ చరణ్ ఒక్కడికే కాదు సిని బృందం మొత్తానికి ఇచ్చారు.. ముందు ఆ విషయం తెలుసుకో అంటూ ఆమెకు రీ కామెంట్ చేస్తున్నారు. అయితే ఆమె చేసిన కామెంట్ బట్టి చూస్తే.. టాలీవుడ్ లో చరణ్ తొక్కేయాలని చూస్తున్నారా అనుమానాలు కొందరిలో మొదలయ్యాయి.