Hyderabad: ప్రస్తుత సమాజంలో మానవత్వం అన్నది మంట కలిసిపోయింది. మనుషులు మానవత్వం అన్న మాటను మరిచి ఒకరినొకరు చంపుకోవడం లాంటివి చేస్తున్నారు. తగాదాలకి పెద్దపెద్ద నిర్ణయాలు తీసుకుని ఒకరిని చంపి జైలుకు వెళ్లడంతో పాటు ఇరు కుటుంబాలను వీధిన నిలబెడుతున్నాయి. ఇటీవల కాలంలో ఇలాంటి ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే చాలా కుటుంబాలు వీధిన పడుతున్నాయి.తాజాగా అటువంటి దారుణమైన ఘటన ఒకటి హైదరాబాదులో చోటుచేసుకుంది. అసలు విషయంలోకి వెళితే..
హైదరాబాద్ లోని ఉప్పల్ రామంతపూర్ డివిజన్ పరిధిలోని వివేక్ నగర్ ప్రాంతంలో సంద్యాల పాండు సాగర్ అనే వ్యక్తి నివసిస్తున్నాడు. పాండు సాగర్ కు భార్య, ముగ్గురు కుమారులు కూడా ఉన్నారు. ఇతను స్థానికంగా టెంట్ హౌస్ ను నడిపిస్తూ ఉండేవాడు. ఇదిలా ఉంటే పాండు సాగర్ నాలుగేళ్ల కిందట ఫిర్జాదిగూడకు చెందిన ఒక మహిళను రెండో వివాహం చేసుకున్నాడు. అప్పటి నుంచి అతను తన మొదటి భార్య, కుమారులను పట్టించుకోవడం లేదు. ఈ నేపథ్యంలోనే వీరి కుటుంబంలో తరుచూ గొడవలు జరుగుతూనే ఉన్నాయి. సాగర్ టెంట్ ను హౌస్ ను అతని పెద్ద కుమారుడు చూసుకుంటున్నాడు.
కాగా ఇటీవల రామంతపూర్ లో ఉన్న తండ్రి పాండు సాగర్ వద్దకు అతని కుమారుడు పవన్ సాగర్ అనే 30 ఏళ్ల వ్యక్తి వచ్చాడు. డబ్బుల విషయంలో తండ్రీ కొడుకులు ఇద్దరు గొడవ పడ్డారు. ఈ క్రమంలోనే ఒకరిపై ఒకరు మాటల దాడి చేసుకున్నారు. ఈ క్రమంలోనే పట్టరాని కోపంతో ఊగిపోయిన కొడుకు పవన్ సుత్తితో తండ్రిపై దాడి చేశాడు. కుమారుడి దాడిలో తండ్రి పాండు సాగర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషయం తెలుసుకున్న అతని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. అనంతరం పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.