Baby vs BRO: కరోనా సమయంలో థియేటర్లు మూతపడటంతో ఓటీటీలు అందుబాటులోకి వచ్చాయి. ఈ విధంగా ఓటీటీలు అందుబాటులోకి వచ్చిన తర్వాత థియేటర్ రన్ పూర్తి చేసుకున్న సినిమాలన్నీ కూడా మనకు ఓటీటీలో అందుబాటులోకి వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఎన్నో సినిమాలు కూడా నేరుగా ఇక్కడే విడుదలవుతూ ఉన్నాయి.ఇకపోతే తాజాగా టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి బేబీ బ్రో సినిమాలు రెండు కూడా త్వరలోనే ఓటీటీలో ప్రసారం కావడానికి సిద్ధమవుతున్నాయి.
సాయి రాజేష్ దర్శకత్వంలో ఆనంద దేవరకొండ వైష్ణవి చైతన్య హీరో హీరోయిన్లుగా నటించిన బేబీ సినిమా సంచలనమైన విజయాన్ని అందుకున్న సంగతి మనకు తెలిసిందే.ఈ సినిమా విడుదలైన రెండు వారాలకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సాయి ధరమ్ తేజ్ నటించిన బ్రో సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే బ్రో సినిమా బేబీ సినిమా ముందు ఏమాత్రం నిలబడలేక భారీగా కలెక్షన్లను కోల్పోయిందని చెప్పాలి.
ఇలా ఇద్దరు స్టార్ హీరోలు నటించిన ఈ సినిమా అనుకున్న స్థాయిలో సక్సెస్ సాధించలేకపోయింది అయితే ఈ రెండు సినిమాలు థియేటర్ పూర్తి చేసుకున్న తర్వాత ఓటీటీలో బిడ్డలకు సిద్ధమవుతున్నాయి. ఈ క్రమంలోని బేబీ సినిమా డిజిటల్ రైట్స్ ప్రముఖ ఓటీటీ సమస్థ ఆహా కొనుగోలు చేశారు. ఈ క్రమంలోనే ఈ సినిమా ఈ నెల 25వ తేదీ విడుదలకు సిద్ధమవుతుంది.
ఇకపోతేపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సాయి ధరమ్ తేజ్ హీరోలుగా నటించినటువంటి బ్రో సినిమా కూడా అదే రోజున నెట్ ఫ్లిక్స్ లోప్రసారానికి సిద్ధమవుతుంది ఇలా ఈ రెండు సినిమాలు ఒకేరోజు విడుదల కానున్నటువంటి నేపథ్యంలో ఏ సినిమా ఏ స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో తెలియాల్సి ఉంది. థియేటర్ పరంగా చూసుకుంటే కనుక బ్రో సినిమా కంటే బేబీ సినిమానే భారీ స్థాయిలో కలెక్షన్స్ రాబట్టింది మరి ఓటీటీలో ఏ సినిమా ఆదరణ పొందుతుందో వేచి చూడాలి.