Akhanda: బాలయ్య అఖండ మూవీ సీక్వెల్ ఏకంగా ఆ రేంజ్ లో ఉండనుందా?

Akhanda: అఖండ నందమూరి బాలకృష్ణ హీరోగా మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను ఈ సినిమా ఎంతటి సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పవలసిన పనిలేదు. బాలకృష్ణ అఘోర గా కనిపించిన ఈ సినిమా ఆడియన్స్ మైండ్ బ్లాక్ చేసింది. సినిమాలోని మాస్ ఎలిమెంట్స్ అండ్ యాక్షన్ సీక్వెన్స్ కు మాస్ ప్రేక్షకులు శివాలెత్తిపోయారు. ఆ యాక్షన్ సీక్వెన్స్ కు తమన్ అందించిన బిజిఎంకు థియేటర్స్ బద్దలైపోయాయి.

 

స్క్రీన్ పై బాలయ్య చేసిన మాస్ జాతరకు బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిసింది. అప్పట్లో ఈ సినిమాని పాన్ ఇండియా లెవెల్ లో విడుదల చేస్తే నేషనల్ వైట్ గా సంచలనాలు సృష్టించేదని అభిప్రాయాలు ఉన్నాయి. అలాగే అఖండ సినిమాకు సీక్వెల్ ఉంటుందని బోయపాటి ఎప్పుడో అనౌన్స్ చేశారు. అయితే తాజా సమాచారం ప్రకారం బోయపాటి ఇప్పుడు అఖండ టు సినిమా మీద తన పూర్తి దృష్టిని నిలిపారని తెలిపింది. ప్రస్తుతం ప్రాజెక్టుకు సంబంధించిన కథను సిద్ధం చేసే పనిలో ఉన్నారట.

ఆఖండ సినిమా ఎక్కడ ఎండ్ అయిందో అక్కడే ఈ సీక్వెల్ కధ మొదలవుతుందని బోయపాటి ఇప్పటికే చెప్పేశారు. అఖండ టూ ని భారీ స్థాయిలో రూపొందించనున్నారుట. ఏకంగా 150 కోట్ల బడ్జెట్తో ఈ సినిమా తెరకెక్కించబోతున్నట్లు సమాచారం. అసలే బాలయ్య, బోయపాటి కాంబినేషన్ దానికి తోడు అఖండకి సీక్వెల్ కావడంతో సినిమా ఏ మాత్రం పాజిటివ్ టాక్ తెచ్చుకున్నా బాక్సాఫీస్ దగ్గర సంచలనాలు సృష్టించటం ఖాయం అంటున్నారు సినీ క్రిటిక్స్.

 

కంటెంట్ బాగుంటే దానికి దైవత్వం తోడైతే ఆ సినిమా పాన్ ఇండియా వైడ్ గా సత్తా చాటుతుంది. దానికి ఉదాహరణగా ఇటీవల విడుదలైన హనుమాన్ సినిమాని చెప్పుకోవచ్చు. బాలయ్య బాబు అభిమానులు అందరూ అఖండ టు సినిమా కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఏమాత్రం కంటెంట్ బాగున్నా సినిమాని ఓ రేంజ్ కి తీసుకెళ్లి పోతారు.

Related Articles

ట్రేండింగ్

YSRCP Leaders Tension: టీడీపీ జనసేన కూటమి మేనిఫెస్టో విషయంలో వైసీపీ భయాలివేనా.. ఆ టెన్షన్ తగ్గట్లేదా?

YSRCP Leaders Tension:తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత జగన్ పార్టీలో భయం మొదలైనట్లుగా ఉంది. ఎందుకంటే వైసీపీ మేనిఫెస్టోలో ఉన్నా హామీల కన్నా కూటమి ఇచ్చిన హామీలు చాలా చాలా...
- Advertisement -
- Advertisement -