Balayya:వయసు పెరుగుతున్నా కూడా ఎందులోనూ తగ్గకుండా వరుసపెట్టి సినిమాలు చేస్తూ నటసింహం నందమూరి బాలకృష్ణ ముందుకు దూసుకు పోతున్నారు. సంక్రాంతికి వీరసింహారెడ్డి సినిమాతో ప్రేక్షకుల ముందుకు బాలయ్య వచ్చి సందడి చేయనున్నారు. ఈ మూవీ పూర్తయిన వెంటనే బాలయ్య 108వ సినిమా షూటింగ్ లో పాల్గొననున్నాడు. దర్శకుడు అనిల్ రావిపూడి ఈ సినిమాను చేయనున్నాడు. సాహు గారపాటి, చంటి పెద్దింటి ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తుండటం విశేషం. ఆ సినిమా తర్వాత కూడా బాలయ్య మరికొన్ని సినిమాలు కూడా చేస్తున్నారు.
ఈ తరుణంలో బాలయ్య నెక్ట్స్ లైనప్ పై ఓ వార్త వైరల్ అవుతోంది. బాలయ్యతో ఇప్పుడు ఓ అదిరిపోయే కాంబినేషన్ రాబోతున్నట్లు తెలుస్తోంది. బాలయ్య చిన్నల్లుడు, వైజాగ్ గీతం విద్యా సంస్థల అధినేత అయిన మతుకుపల్లి శ్రీ భరత్ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. కొద్ది రోజులుగా బాలయ్య వ్యవహారాలను ఆయన రెండో కుమార్తె తేజస్విని దగ్గరుండి చూసుకుంటూ ఉండగా ఇప్పుడు ఆయన రెండో అల్లుడు నిర్మాతగా సాగనున్నారు.
బాలయ్య సినిమాల కథలు వినడంలోనూ, ఆయన డిజైన్లు, లుక్ తదితర వ్యవహారాలను తన చిన్న కూతురు దగ్గరుండి చూసుకుంటోంది. అదే విధంగా తండ్రి సినిమాల షూటింగ్లకు ఆమె వెళ్తూ వస్తోంది. పలు నిర్మాణ వ్యవహారాలను కూడా ఆమె పర్యవేక్షిస్తుంది. అన్నింటిని పరిశీలిస్తూ నిర్మాణ రంగంలో పట్టు సాధిస్తోంది. ఈ క్రమంలోనే వారు నిర్మాణ రంగంలోకి అడుగు పెడుతున్నట్టుగా కూడా స్పష్టంగా అర్థమవుతోందని చెప్పాలి.
బాలయ్య కొడుకు అయిన మోక్షజ్ఞ డెబ్యూ మూవీ ఆదిత్య 369 సీక్వెల్ ను తమ సొంత బ్యానర్పై నిర్మించనున్నట్లు దానికి తేజస్విని నిర్మాతగా వ్యవహరిస్తారనే టాక్ కూడా సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తోంది. ఇకపోతే బాలయ్య, బోయపాటి శ్రీను సినిమాను 14 రీల్స్ బ్యానర్ నిర్మించనుంది. ఈ సినిమాలోనూ 20 శాతం వాటాను తేజస్విని, ఆమె భర్త భరత్ ఉండేలా చర్చలు సాగుతున్నాయి.