Balayya-Tarak:బాలయ్యకు మాటిచ్చిన యంగ్ టైగర్.. ప్రాణాలిచ్చేస్తానంటూ?

Balayya-Tarak:నందమూరి నటసింహం బాలయ్య కొడుకు మోక్షజ్ఞ తేజను హీరోగా టాలీవుడ్‌కు పరిచయం చేయనున్న విషయం తెలిసిందే. మంచి కథతో.. తెలుగు ప్రేక్షకులు ఆదరించేలా.. మోక్షజ్ఞను హీరోగా స్వీకరించేలా బాలయ్య శత విధాల ప్రయత్నిస్తున్నారు. అలాగే హీరోగా ఎప్పుడు ఎంట్రీ ఇస్తాడు? ఏ సినిమాలో కనిపించనున్నాడు? సినిమా స్టోరీ ఎలాంటిది? ఎవరి దర్శకత్వంలో సినిమా చేయాలి? తదితర విషయాలపై బాలయ్య జాగ్రత్త వహిస్తున్నారు. ఇటీవల గోవా ఫిల్మ్ ఫెస్టివల్‌లో పాల్గొన్న బాలయ్య తన కుమారుడి వెండితెర ఆరంగేట్రంపై మరోసారి స్పందించారు. మోక్షజ్ఞను ఇండస్ట్రీకి ఎప్పుడు పరిచయం చేస్తారని మీడియా ప్రశ్నించగా.. దానికి ఆయన సమాధానం చెప్పారు. వచ్చే ఏడాది తప్పనిసరిగా మోక్షజ్ఞను టాలీవుడ్‌కు పరిచయం చేస్తున్నట్లు బాలయ్య వెల్లడించారు.

 

అయితే మోక్షజ్ఞను మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఎంట్రీ ఇస్తారా? అనే ప్రశ్నకు బాలయ్య నవ్వుతూ.. అది దైవ నిర్ణయం అని, సినిమా స్టోరీ సెట్ అయితే బోయపాటితో సినిమా చేయవచ్చని బదులిచ్చారు. అయితే ఇప్పటికే బాలయ్య డైరెక్షన్‌లో రానున్న ‘ఆదిత్య 369’ సీక్వెల్‌లో మోక్షజ్ఞను ఇంట్రడ్యూస్ చేయనున్నట్లు ప్రచారం జరిగింది. ఒక వేళ ఈ సినిమాలో కాకున్న మంచి స్టోరీ ఉన్న మూవీలో హీరోగా పరిచయం చేయాలని బాలయ్య అనుకుంటున్నట్లు సమాచారం. దీని కోసం బాలయ్య.. యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ను కూడా కలిసినట్లు ప్రచారం జరుగుతోంది. దానికి ఎన్టీఆర్ కూడా మద్దతు తెలిపినట్లు తెలుస్తోంది. సినిమా స్టోరీల ఎంపిక విషయంలో మోక్షజ్ఞకు తన వంతు సాయం చేస్తానని ఎన్టీఆర్ మాట ఇచ్చినట్లు సినీ వర్గాల్లో పుకార్లు వినిపిస్తున్నాయి. అలాగే మోక్షజ్ఞ స్టార్ హీరోగా ఎదిగే విషయంలోనూ అండగా ఉంటానని, స్టార్ డైరెక్టర్ల దర్శకత్వంలోనే మోక్షజ్ఞ హీరోగా నటించేలా చూసుకుంటానని ఎన్టీఆర్ హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.

 

 

మోక్షజ్ఞ కెరీర్ లో సక్సెస్ కావడం కోసం ప్రాణాలిచ్చే స్థాయిలో తాను కష్టపడతానని ఎన్టీఆర్ చెప్పినట్టు సమాచారం. ఒకవేళ ఎన్టీఆర్.. మోక్షజ్ఞ సినిమాకు స్టోరీ ఓకే చెప్తే.. సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని నందమూరి ఫ్యాన్ అభిప్రాయపడుతున్నారు. త్వరలో మోక్షజ్ఞను తెరపై చూసే అవకాశం లభించబోతుందని పండగ చేసుకుంటున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -