Nara Brahmani: షాకింగ్ నిర్ణయం తీసుకున్న బాలయ్య కూతురు.. అసలేం జరిగిందంటే?

Nara Brahmani: సమాజంలో ఏ విషయంలోనైనా.. ఆఖరికి రాజకీయాలలో కూడా స్త్రీలకు పట్టు ఎక్కువ ఉంటుంది. వాళ్ళు తలచుకుంటే ఏదైనా చేయగలరు. నారా చంద్రబాబు కోడలు, నారా లోకేష్ భార్య,బాలకృష్ణ కూతురు అయిన నారా బ్రాహ్మిణి ని టిడిపి ఎన్నికల్లో నిలబెట్టబోతున్నారు అని తాజా వార్తలు వస్తున్నాయి. కిందటిసారి ఎన్నికల అప్పుడు కూడా బ్రాహ్మిణి ప్రచారం పనులలో పాలుపంచుకున్నారు. మంచి వాగ్వాది కూడా.

బ్రాహ్మిణి ముందు తన కుటుంబ వ్యవహారాలను, అలాగే కొన్ని వ్యాపార బాధ్యతలను మోసారు. కానీ ఇప్పుడు సమయం రావడంతో తనని కూడా రాజకీయాల్లోకి దించాలని టిడిపి అనుకుంటుంది. హిందూపురానికి ఎమ్మెల్యేగా ఉన్న నందమూరి బాలకృష్ణ స్థానంలో ఈ సంవత్సరం ఎమ్మెల్యే టికెట్ను నారా బ్రాహ్మిణి కి ఇద్దాం అనుకుంటున్నారట. దీనికి కూడా కారణం ఉండనే వచ్చింది. హిందూపురంలో గత చాలా ఏళ్లలో పురుషులకే ఎక్కువ సీట్లు వచ్చాయి.

 

కనుక ఈ సంవత్సరం వైసీపీ వాళ్లు ఒక మహిళ కి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి పోటీగా నిల్చబెడదాం అనుకుంటున్నారు.మహిళ కాబట్టి సెంటిమెంటల్ గానైనా గెలుస్తుంది అని ఆలోచన. అయితే తనకి పోటీగా ఇటువైపు కూడా మహిళనే పెడదాము అని అనుకున్నారు టీడీపీ వాళ్లు. ముందు బాలకృష్ణ భార్య అయినా వసుంధర ని నిల్చోపెడదాం అనుకున్నారట.తనకి కూడా రాజకీయాల మీద పట్టు ఎక్కువగానే ఉంది.హిందూపురం మీద కూడా పూర్తి అవగాహన ఉన్నది.

 

కిందటి సారి బాలకృష్ణ ఎన్నికల సమయంలో వసుంధర అక్కడే ఉంది. కానీ టిడిపి వాళ్లు తనకన్నా బ్రాహ్మిణి అయితేనే బాగుంటుందేమో అని ఆలోచనలో పడ్డారు. ఈ విషయం మీద చాలా రోజులు నుంచి ఎన్నో వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇది ఒకవేళ నిజమైతే మరి నందమూరి బాలకృష్ణ వచ్చే ఏడాది ఎన్నికల్లో ఏ నియోజకవర్గంలో ఎమ్మెల్యే గా నిల్చుంటారు అనేది ఆసక్తికరంగా మారింది.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: కూటమి విజయాన్ని ఫిక్స్ చేసిన జగన్.. మేనిఫెస్టో హామీలతో బొక్కా బోర్లా పడ్డారా?

CM Jagan: త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో నిర్వహిస్తున్నారు. అయితే వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటూ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు....
- Advertisement -
- Advertisement -