Bigg Boss 7 Telugu: వాడు నా వెంట్రుకతో సమానమన్న శివాజీ.. సంతలో పశువుల కంటే హీనంగా ప్రవర్తిస్తున్నారుగా!

Bigg Boss 7 Telugu: తెలుగులో ప్రసారమవుతున్న బిగ్ బాస్ సీజన్ 7 రసవత్తరంగా సాగుతోంది. కొట్లాటలో గొడవలు అరుపులతో ప్రేక్షకులకు కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ ను అందిస్తున్నారు. ఇకపోతే పవర్ అస్త్ర సాధించుకున్న వారు మాత్రమే కంటెస్టెంట్స్ గా అవుతారు అని బిగ్ బాస్ అలాగే హోస్ట్ నాగార్జున తెలిపిన విషయం తెలిసిందే. దాంతో హౌస్ లో ఉన్న ప్రతి ఒక్క కంటెస్టెంట్ కూడా ఆ పవర్ అస్త్రా కోసము బాగానే కష్టపడుతున్నారు. అలాగే ఇప్పటికే పవర్ అస్త్రా సాధించుకున్న వారిపై ఫోకస్ కూడా ఎక్కువయ్యింది. అయితే, అమర్ దీప్ చేసిన పనికి టేస్టీ తేజ అనుకోకుండా శివాజీకి టార్గెట్ అయ్యాడు.

మొదటి వారంలో పవర్ అస్త్రాను సందీప్ గెలుచుకున్న తర్వాత కూడా దానిని శుభశ్రీ దొంగిలించింది. ఇప్పుడు శివాజీ పవర్ అస్త్రా విషయంలో కూడా అదే జరిగింది. దీంతో సందీప్‌కు ఈ విషయం గురించి ఏమైనా ఐడియా ఉంటుందేమో అని తనతో డిస్కషన్ మొదలుపెట్టాడు. సందీప్‌కు శివాజీ పవర్ అస్త్రాను ఎవరు దొంగిలించారో తెలుసు అని చెప్పాడు. చెప్పొద్దు అని మాట తీసుకున్నాడని కూడా అన్నాడు. కానీ తాను ఎవరితో ఈ మాట గురించి చెప్పను అంటూ శివాజీ అడిగాడు. దీంతో సందీప్ తేజ పేరు చెప్పాడు. అప్పటినుంచి తేజను టార్గెట్ చేస్తూ వ్యాఖ్యలు చేయడం మొదలుపెట్టాడు శివాజీ. ఈ విషయంలో తేజను ఇరికించినట్టుగా తనకు వెళ్లి చెప్పాడు సందీప్.

కానీ అమర్‌దీపే ఆ అస్త్రాన్ని దొంగిలించిన విషయం తేజకు కూడా తెలియదు. తేజనే తన పవర్ అస్త్రాను దొంగిలించాడు అనుకున్న శివాజీ. దాంతో నోటికి వచ్చిన విధంగా మాట్లాడుతూ రెచ్చిపోయాడు. వాడికి క్యారెక్టర్ లేదు అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. అంతే కాకుండా అది తన వెంట్రుకతో సమానం అంటూ కామెంట్స్ చేశాడు. క్యారెక్టర్ అనేది ముఖ్యమని, అడుక్కుతిని ఈ వీక్‌లో సేవ్ అయ్యాడని, ఇలాంటి చిల్లర గేమ్స్ ఆడకూడదు, మగాడిలాగా ఆడాలి అంటూ తేజను ఉద్దేశించి మాట్లాడాడు. ఆ తర్వాత పల్లవి ప్రశాంత్‌తో ఈ విషయం గురించి మాట్లాడిన శివాజీ తేజ బుద్ధి కుక్కతోకలాంటిది అని, అందుకే తను ఎదగడం లేదు అని టార్గెట్ చేస్తూ మాట్లాడాడు. తేజకు కూడా శివాజీ తననే టార్గెట్ చేస్తున్నట్టు తెలిసినా పెద్దగా స్పందించకుండా అలాగే ఉండిపోయాడు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -