Shivaji: వెండితెర నటుడిగా బిగ్ బాస్ కంటెస్టెంట్ గా ఎంతో ఫేమస్ అయినటువంటి నటుడు శివాజీ ప్రస్తుతం వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటూ సంచలన వ్యాఖ్యలు చేస్తూ వార్తలలో నిలుస్తూ ఉన్నారు. బిగ్ బాస్ కార్యక్రమం పూర్తి అయిన తర్వాత ఈయన వరుసగా ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నారు. ఈ ఇంటర్వ్యూలలో భాగంగా బిగ్ బాస్ కార్యక్రమం గురించి ఇతర కంటెస్టెంట్ల గురించి సంచలన వ్యాఖ్యలు చేస్తున్న సంగతి తెలిసిందే.
ఇకపోతే తాజాగా ఎన్టీఆర్ వర్ధంతిని పురస్కరించుకొని ఈయన అనంతపురంలో పర్యటించిన సంగతి మనకు తెలిసిందే. అనంతపురంలోని సీనియర్ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఈయన నివాళులు అర్పించారు అనంతరం మీడియా సమావేశంలో శివాజీ మాట్లాడుతూ రాజకీయాల గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.
మరొక నెల రోజుల వ్యవధిలో ఎన్నికలకు నోటిఫికేషన్ వెలబడుతున్నటువంటి తరుణంలో ఇప్పటికే అన్ని పార్టీ నాయకులు సీట్లు సర్దుబాటు చేయడం వంటి పనులలో నిమగ్నమయ్యారు దీంతో ఏపీ రాష్ట్ర రాజకీయాలపై అందరూ కూడా చాలా ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ క్రమంలోనే శివాజీ కూడా రాజకీయాల గురించి మాట్లాడుతూ టికెట్ల విషయంలో సూట్ కేసులు ఇచ్చి బీఫామ్ తెచ్చుకొనే సంస్కృతి పోయే వరకు ఈ రాజకీయాలు మారవని తెలిపారు.
నేటి తరం నాయకులు మాదిరిగా తమ కుటుంబాన్ని రాజకీయాలలోకి తీసుకువచ్చి దోపిడీకి తెర లేపలేదని సహజ వనరులను దోచుకోమని చెప్పలేదు అంటూ పరోక్షంగా ఈయన వైఎస్ఆర్సిపి పార్టీపై విమర్శలు కురిపించారు. డబ్బు కోసం ఎవరూ కూడా ఓట్లు అమ్ముకోవద్దని ప్రజలందరూ కూడా సరైన నాయకున్ని ఎన్నుకోవాలంటూ ఈ సందర్భంగా ఈయన చేసినటువంటి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.