Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ సెవెన్ కార్యక్రమం ప్రస్తుతం ప్రసారమవుతున్న సంగతి మనకు తెలిసిందే .ఈ కార్యక్రమం తెలుగులో ఏడవ సీజన్ ప్రారంభమై ఇప్పటికే ఐదు వారాలను పూర్తి చేసుకుంది ఇలా ఐదు వారాలకు కాను ఐదు మంది కంటెస్టెంట్లు హౌస్ నుంచి బయటకు వెళ్లిపోయారు. ఈ విధంగా హౌస్ నుంచి 5 మంది కంటెస్టెంట్లు బయటకు వెళ్లిపోవడంతో మరో ఐదుగురు వైల్డ్ కార్డు ద్వారా బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టారు.
ఇలా బిగ్ బాస్ మినీ లాంచ్ ఈవెంట్ నిర్వహించే నాగార్జున అయిదుగురు కంటెస్టెంట్లను హౌస్ లోకి పంపించిన సంగతి. ఇక ఈ ఐదుగురు కంటెస్టెంట్ లో హౌస్ లోకి వెళ్లడంతో బిగ్ బాస్ వీరికి గొడవ పెట్టే ప్రయత్నం చేశారు. ఇక కొత్త కంటెస్టెంట్లతోనే హౌస్ ఆఫ్ ది బెడ్ గా ఏకంగా ఇద్దరినీ నిర్ణయించారు. ఇక హౌస్ లోకి వెళ్లినటువంటి ఈ కంటెస్టెంట్లకు డీలక్స్ రూమ్ ఇచ్చారని తెలుస్తోంది.
ఎప్పటి నుండో ఎంతో కస్టపడి గేమ్ ఆడిన పాత కంటెస్టెంట్స్ కి కూడా ఇవ్వకుండా, కొత్తవాళ్లకు ఇవ్వడం లో బిగ్ బాస్ ఆంతర్యం గొడవలు పెట్టడానికే స్పష్టంగా అర్థం అవుతుంది.కొత్త వాళ్లకు డీలక్స్ పాత వాళ్లకు స్టాండర్డ్ బెడ్స్ ఇవ్వడంతో భారీ స్థాయిలో గొడవ చేసుకుని అవకాశాలు కూడా ఉన్నాయి. మరోపక్క గార్డెన్ ఏరియా మొత్తం క్లోజ్ చేసేసారు. అయితే బిగ్ బాస్ ఇదంతా ఉద్దేశపూర్వకంగానే చేస్తున్నారని ఇద్దరి మధ్య గొడవ పెట్టడం కోసమే ఇలా చేస్తున్నారని స్పష్టంగా అర్థం అవుతుంది.