Abhinayashree: బిగ్ బాస్ లో అంతా మోసం.. అభినయశ్రీ షాకింగ్ కామెంట్స్!

Abhinayashree: తెలుగు రాష్ట్రాల ప్రజలకు బిగ్ బాస్ షో గురించి పెద్దగా పరిచయంకర్లేదు. ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ షో ప్రస్తుతం భారీ స్థాయిలో ప్రేక్షకుల ఆదరణ దక్కించుకుంది. గణనీయంగా 5 సీజన్లు పూర్తిచేసుకుని ప్రస్తుతం ఆరో సీజన్ ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో ఆసక్తికరంగా మారింది. ఇదంతా పక్కన పెడితే మొదటి రెండు వారాల్లో ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లు కొంచెం బిగ్ బాస్ హౌస్ గురించి నెగిటివ్ గా మాట్లాడుతారు.

అయితే ఈ ఆనవాయితీ బాస్ మొదటి సీజన్ నుంచి ఉన్నదే. బిగ్ బాస్ షో లో పాల్గొన్న కంటెస్టెంట్లు మొదటి రెండు వారాల్లో ఎలిమినేట్ అయితే వారు ఆ బాధను తట్టుకోలేక బిగ్ బాస్ నిర్వాహకులపై దుమ్మెత్తు పోస్తూ ఉంటారు. అదేవిధంగా గతంలో ప్రసరమైన నాన్ స్టాప్ కంటెస్టెంట్ లు కూడా బిగ్ బాస్ షో పై విరుచుకుపడ్డారు. ఇక ఈ సీజన్ లో అభినయశ్రీ రీసెంట్ గా ఎలిమినేట్ అయ్యింది. అభినయశ్రీ మొదటివారం ఎలిమినేషన్ నుంచి తప్పించుకుంది.

కానీ ఆ గండం రెండో వారంలో తప్పలేదు. ఇక రెండవ వారం బిగ్ బాస్ నుంచి బయటకు రావడంతో అభినయశ్రీ బిగ్ బాస్ షో గురించి అనేక రకాలుగా నెగిటివ్ కూతలు కూస్తుంది. బిగ్ బాస్ అంతా మోసమని అంటుంది. తనని కనీసం ఐదు నిమిషాలు కూడా చూపించలేదని తెలిపింది. అంతేకాకుండా తనకి బిగ్ బాస్ చాలా అన్యాయం చేశారని అభినయశ్రీ అంటుంది. ఇక తనకు రెమ్యూనరేషన్ విషయంలో కూడా చాలా అన్యాయం చేశారని తెలిపింది.

తనకంటే తక్కువ ఓట్లు వచ్చిన వారిని హౌస్ లో ఉంచారాని తనని హౌస్ నుంచి లెఫ్ట్ చేశారని అభినయశ్రీ బాధపడుతుంది. మరి ఇటువంటి కాంట్రవర్సీలకు రాబోయే బిగ్ బాస్ సీజన్స్ పై ఏమైనా ఎఫెక్ట్ పడుతుందా అని ఆలోచిస్తున్నారు. ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ సిక్స్ మాత్రం రసవత్తంగా సాగుతుంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -