Bigboss: ఎర్రి మొహం వేసుకొని చూస్తావ్ ఏంట్రా.. బిగ్ బాస్ ప్రోమో వైరల్

Bigboss: బుల్లితెర ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి బిగ్ బాస్ కార్యక్రమం మరికొద్ది రోజులలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలోనే ఇప్పటికే బిగ్ బాస్ హంగామా మొదలైందని తెలుస్తోంది. ఇదివరకే నిర్వాహకులు ఈ కార్యక్రమానికి సంబంధించిన లోగో, ప్రోమో కూడా విడుదల చేశారు. ఈ ప్రోమో ఈ కార్యక్రమాన్ని అమితంగా ఆకట్టుకునేలా ఉందని చెప్పాలి.ఇదిలా ఉండగా తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన మరో ప్రోమో విడుదల చేస్తూ ఈ కార్యక్రమం ప్రసార తేదీని కూడా ప్రకటించారు.

ఈ క్రమంలోనే తాజాగా విడుదలైన ప్రోమోలో భాగంగా ఓ గల్లీలో కుర్రాళ్ళు అందరూ కలిసి క్రికెట్ ఆడుతుంటారు. అయితే బిగ్ బాస్ కార్యక్రమ ప్రసార సమయం కావడంతో ఒక్కసారిగా అక్కడ ఉన్న కుర్రాళ్ళు అందరూ మాయమవుతారు.దీంతో బ్యాటింగ్ చేసే కుర్రాడు ఏమైంది వీళ్లకు ఎక్కడికి వెళ్లారు అంటూ ఆలోచిస్తుండగా అదే సమయంలో ఏంట్రా అలా ఎర్రి ముఖం వేసుకొని చూస్తున్నావ్ అంటూ నాగార్జున ఎంట్రీ ఇస్తారు.

ఇక్కడ ఆట ముగిసింది అంటే అక్కడ అసలైన ఆట మొదలైనట్టే అంటూ నాగార్జున లైఫ్ లో ఏ మూమెంట్ అయినా బిగ్ బాస్ తరువాతనే.. బిగ్ బాస్ సీజన్ 6 ఎంటర్టైన్మెంట్ కి అడ్డాఫిక్స్ అంటూ ఈ కార్యక్రమం సెప్టెంబర్ 4వ తేదీ ప్రసారం కాబోతుందని ప్రోమో విడుదల చేశారు. ఈ ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.ఇక ఈ కార్యక్రమం సెప్టెంబర్ 4వ తేదీ సాయంత్రం 6 గంటల నుంచి ప్రసారం కాబోతోంది.

ఇకపోతే ఇప్పటికే ఈ సీజన్లో పాల్గొనబోయే కంటెస్టెంట్ ల గురించి రోజుకో వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ క్రమంలోనే ఈసారి కూడా సోషల్ మీడియాలో ఎంతో గుర్తింపు పొందిన వారిని అలాగే యాంకర్లు, సింగర్స్,బుల్లితెర నటీనటులను ఈ కార్యక్రమంలోకి కంటెస్టెంట్ గా పంపిస్తున్నట్లు సమాచారం అయితే ఎవరెవరు ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి ఉండాలి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -