Jobs: పది పాసైన వాళ్లకు ఇంతకు మించిన శుభవార్త ఉంటుందా?

Jobs: తబలా శాఖ ఎప్పటికప్పుడు ఆయా శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేస్తూనే ఉంది. తరచూ ఏదో ఒక ప్రదేశంలో ఈ పోస్ట్ ఆఫీస్ నుంచి ఉద్యోగాలను భర్తీ చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే తాజాగా తపాలా శాఖలో మరోసారి భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైంది. దేశ వ్యాప్తంగా వివిధ పోస్టల్‌ సర్కిళ్లలోని బ్రాంచి పోస్ట్‌ ఆఫీసుల్లో 12,828 గ్రామీణ డాక్ సేవక్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. పదో తరగతిలో సాధించిన మార్కులతో మెరిట్‌ ఆధారంగా ఈ నియామకాలు చేపట్టనున్నారు.

ఎంపికైనవారు బ్రాంచ్‌ పోస్టు మాస్టర్‌, అసిస్టెంట్‌ బ్రాంచ్‌ పోస్టు మాస్టర్‌ హోదాల్లో విధులు నిర్వహించాల్సి ఉంటుంది. ఆసక్తి ఉన్నవారు మే 22 నుంచి జూన్‌ 11లోగా వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్‌ ప్రకారం మొత్తం 12,828 ఖాళీలను భర్తీ చేయనుండగా.. వీటిలో ఏపీలో 118, తెలంగాణలో 96 చొప్పున పోస్టులు ఉన్నాయి. ఇకపోతే అర్హతల విషయానికి వస్తే.. అభ్యర్థులు పదో తరగతిలో ఉత్తీర్ణత సాధించినవారై ఉండాలి. ఇందులో మ్యాథ్స్‌, ఇంగ్లిష్‌, స్థానిక భాష ఉండటం తప్పనిసరి. ఏపీ, తెలంగాణకు చెందినవారు తెలుగు సబ్జెక్టు పదో తరగతి వరకు చదవడం తప్పనిసరి. కంప్యూటర్ పరిజ్ఞానంతో పాటు సైకిల్‌ తొక్కడం రావాలి.
వయో పరిమితి..

 

అభ్యర్థులు జూన్‌ 11, 2023 నాటికి 18 నుంచి 40 ఏళ్ల మధ్య వయసు ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్లు గరిష్ఠ వయసులో సడలింపు ఉంది. బీపీఎం పోస్టులకు నెలకు వేతనం రూ.12,000 – రూ.29,380 ఏబీపీఎం పోస్టులకు రూ.10,000 – రూ.24,470 చొప్పున చెల్లిస్తారు.
ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ట్రాన్స్‌విమెన్‌లకు దరఖాస్తు రుసుం లేదు. మిగిలిన అభ్యర్థులు రూ.100 చెల్లించాలి. కాగా బీపీఎం/ఏబీపీఎం విధుల విషయానికి వస్తే.. బ్రాంచ్‌ పోస్టు మాస్టర్‌ పోస్టుకు ఎంపికైనవారు సంబంధిత బ్రాంచ్‌ కార్యకలాపాలు పర్యవేక్షించాలి. పోస్టల్‌ విధులతోపాటు ఇండియా పోస్టు పేమెంట్‌ బ్యాంకు వ్యవహారాలూ చూసుకోవాలి. రికార్డుల నిర్వహణ, ఆన్‌లైన్‌ లావాదేవీలు, రోజువారీ కార్యకలాపాలు సజావుగా సాగేలా, ఉత్తరాలు పంపిణీ జరిగేలా చూసుకోవాలి. తపాలాకు సంబంధించిన మార్కెటింగ్‌ వ్యవహారాలూ చక్కబెట్టాలి. టీమ్‌ లీడర్‌గా సంబంధిత బ్రాంచ్‌ను నడిపించాలి. పోస్టల్‌ పథకాలను ప్రజల వద్దకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ఉంటుంది. అసిస్టెంట్‌ బ్రాంచ్‌ పోస్టుమాస్టర్‌ ఉద్యోగంలో చేరినవాళ్లు స్టాంపులు/ స్టేషనరీ విక్రయాలు, ఉత్తరాల పంపిణీ జరిగేలా చూడాలి. ఇండియన్‌ పోస్టు పేమెంట్‌ బ్యాంకుకు సంబంధించిన డిపాజిట్లు, పేమెంట్లు, ఇతర లావాదేవీలను చక్కబెట్టాల్సి ఉంటుంది. బ్రాంచ్‌ పోస్టుమాస్టర్‌ నిర్దేశించిన పనులు పూర్తి చేయాలి. వివిధ పథకాలపై ప్రజల్లో అవగాహన కల్పించడం వంటి కార్యకలాపాలు నిర్వహించాల్సి ఉంటుంది.

Related Articles

ట్రేండింగ్

Chittoor: పెద్దిరెడ్డి ఇలాకాలో వైసీపీ అరాచకం.. ప్రచారానికి వస్తే చంపే సంస్కృతి ఉందా?

Chittoor: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాక పుంగనూరులో వైసీపీ అరాచకం తారాస్థాయికి చేరింది. భారత చైతన్య యువజన (బీసీవై )పార్టీ ప్రచార కార్యక్రమాన్ని వైసీపీ శ్రేణులు . అడ్డుకున్నారు. పుంగనూరు మండలం మాగాండ్ల...
- Advertisement -
- Advertisement -