Hyderabad: ప్రియురాలిని కాదని మరో యువతని చేసుకోలేక.. చివరికి అలా?

Hyderabad: ప్రస్తుత కాలంలో యువత ఎక్కువగా ప్రేమ పెళ్లి అంటూ జీవితాలను చేజేతులా నాశనం చేసుకుంటున్నారు. తల్లిదండ్రులను ఎదిరించి మరీ ప్రేమ పెళ్లిళ్లు చేసుకుని నరకం అనుభవిస్తున్నారు. ఇంకొంతమంది ఆత్మహత్యలు చేసుకుని తల్లిదండ్రులకు తీరని శోఖాన్ని మిగులుస్తున్నారు. నిత్యం ఇలాంటి ఘటనలు దేశం వ్యాప్తంగా ఎక్కడో ఒక చోట వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. తాజాగా అలాంటి ఘటనే మరొకటి చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే..హైదరాబాద్ రామాంతాపూర్ పరిధిలోని గోకుల్ నగర్ ప్రాంతంలో సాంబరాజు అనే 22 ఏళ్ళ యువకుడు నివసిస్తున్నాడు.

ఇతను స్థానికంగా ఉండే ఒక నగల దుకాణంలో పని చేస్తున్నాడు. అయితే సాంబరాజు ఇదే ప్రాంతానికి చెందిన ఒక యువతిని గత కొంత కాలంగా ప్రేమిస్తున్నాడు. ఆ అమ్మాయినే పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న సాంబరాజు తల్లిదండ్రులు ప్రేమించిన యువతితో కాకుండా మరో యువతిని చేసుకోమంటూ అతనిపై ఒత్తిడి తెచ్చారు. దీనిని సాంబరాజు జీర్ణించుకోలేక తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. ఆ సమయంలో అతనికి ఏం చేయాలో అస్సలు అర్థం కాక తాజాగా బేగంపేటలోని ఒక హోటల్ కు వెళ్లాడు. అందులోకి వెళ్లిన తరువాత ఒక చున్నీతో ఫ్యానుకు ఉరి వేసుకోవాలని అనుకున్నాడు.

 

అన్ని ఏర్పాట్లు చేసుకుని తన స్నేహితులకు వీడియో కాల్ చేశాడు. నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు, అందుకే చనిపోతున్నా అని కాల్ కట్ చేశాడు. దీంతో అతని స్నేహితులు సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా వెంటనే అతడున్న హోటల్ కు వెళ్లారు. కానీ, ఫలితం లేకపోవడంతో అతడు అప్పటికే మరణించాడు. ఈ విషయం తెలుసుకున్న మృతుడి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు గుండెలు పగిలేలా ఏడ్చారు. ఆ తర్వాత పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -