Celebrities: ఈ సెలబ్రిటీలు మూడు పెళ్లిళ్లు చేసుకున్నారని మీకు తెలుసా?

Celebrities: ఇండస్ట్రీలో కొందరు మూడు పదుల వయసునాలుగు పదులు వయసు దాటినా కూడా పెళ్లిళ్లు చేసుకోకుండా అలాగే ఉంటారు. ఇంకొందరు మాత్రం సినీ ఇండస్ట్రీలో రెండు మూడు పెళ్లిళ్లు చేసుకున్న వారు ఉన్నారు. మరి సినీ ఇండస్ట్రీలో మూడు పెళ్లిళ్లు చేసుకున్నవారి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. అందులో నటుడు నరేష్ మొదట సినిమాటోగ్రాఫ‌ర్ శ్రీను కుమార్తెను చిన్న వ‌య‌స్సులోనే పెళ్లి చేసుకోగా దంపతులకు పుట్టిన కుమారుడు పుట్టాడు. అతనే హీరో న‌వీన్ విజ‌య్‌కృష్ణ. ఆ తర్వాత ఆమెతో మనస్పర్ధలు రావడంతో విడాకులు తీసుకున్న నరేష్ అనంతరం ప్రముఖ రచయిత దేవుళ్ళ పల్లి కృష్ణశాస్త్రి మనవరాలు రేఖా సుప్రియను రెండవ వివాహం చేసుకోగా వారికి కొడుకు పుట్టిన తర్వాత మళ్లీ ఆమెతో కూడా మనస్పర్ధలు వచ్చాయి.

 

ముచ్చటగా మూడోసారి మాజీ మంత్రి రఘువీరారెడ్డి సోదరుడి కుమార్తె రమ్య రఘుపతిని పెళ్లి చేసుకున్నాడు నరేష్. ఆమెకు కూడా ఒక బాబు పుట్టిన తర్వాత ఆమెకు దూరంగా ఉంటున్న నరేష్ సినీ నటి పవిత్ర లోకేష్ తో కలిసి ఉంటున్న విషయం తెలిసిందే. అలాగే విశ్వ నటుడు కమలహాసన్ మొదట వాణి గణపతి ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత కొన్నేళ్లకు విడాకులు ఇచ్చేసి బాలీవుడ్ ఫేమస్ హీరోయిన్ సారీకను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. తర్వాత కొన్నేళ్ళకు సారికకు విడాకులు ఇచ్చేసి కమల్ హాసన్ సీనియర్ నటి గౌతమితో సహజీవనం చేశాడు. ఆ తర్వాత గౌతమికి కూడా దూరమయ్యాడు కమలహాసన్. అలాగే తెలుగు సినీ నటి రాధిక మొదట మలయాళ దర్శకుడు ప్రతాప్ పోతన్ ను పెళ్లి చేసుకుంది.

 

ఆ తర్వాత ఏడాదికే విడాకులు ఇచ్చేసి బ్రిటిష్ వ్యక్తిని ఇష్టపడి పెళ్లి చేసుకునే లండన్ లో స్థిరపడింది. వారికి కుమార్తె పుట్టిన తర్వాత అతడు రాధికను హింసించడంతో అతనికి కూడా విడాకులు ఇచ్చేసి ఇండియాకు తిరిగి వచ్చి సీనియర్ నటుడు శరత్ కుమార్ ను పెళ్లి చేసుకుంది. అలాగే ఈరోజు జెమినీ గణేషన్ మొదట భార్యకు దూరమైన తర్వాత తెలుగు హీరోయిన్ పుష్పవల్లితో సహజీవనం చేశాడు. వీరికి పుట్టిన సంతానమే బాలీవుడ్ నటి రేఖ. తర్వాత సావిత్రిని మూడవ వివాహం చేసుకున్నాడు జెమినీ గణేషన్. వీరితో పాటు బాలీవుడ్ న‌టులు కిషోర్ కుమార్, వినోద్ మెహ్రా, సిద్ధార్థ్‌ రాయ్ క‌పూర్, సంజ‌య్‌ ద‌త్, క‌ర‌ణ్‌సింగ్ గ్రోవ‌ర్ పలువురు మూడు పెళ్లిళ్లు చేసుకున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -