ఇక ఇప్పుడు సోషల్ మీడియా వాడకం కూడా బాగా పెరిగిపోవడంతో.. ఏ సెలబ్రిటీలైన తమ అతి వల్ల వెంటనే ట్రోలింగ్స్ లకు గురవుతున్నారు. ఇప్పటికీ చాలామంది సెలబ్రిటీలను చాలా రకాలుగా ట్రోల్స్ కు గురి చేశారు ట్రోలర్స్. అయితే తాజాగా వారి ఇంగ్లీష్ యాక్సెంట్ పై కూడా ట్రోల్ చేస్తున్నారు ట్రోలర్స్. మామూలుగా సెలబ్రిటీలు గ్లోబల్ లెవెల్ లో గుర్తింపు పొందినప్పుడు ఇతర దేశాలకు వెళ్లాల్సి వస్తుంది. అప్పుడు సచ్చినట్లుగా వాళ్ళ లాగానే మాట్లాడటానికి ప్రయత్నిస్తూ ఉంటారు.
ఇప్పటికే మంచు లక్ష్మి ఇంగ్లీష్ మాట్లాడే సెలబ్రిటీలపై వెంటనే తప్పు పసిగట్టి సరి చేస్తుంది. నిజానికి మన ఇండియన్ ఇంగ్లీష్, ఇతర దేశాలలో మాట్లాడి ఇంగ్లీష్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ముఖ్యంగా పలకడంలో బాగా దీర్ఘం తీసినట్లు అనిపిస్తుంది. అయితే ఆర్ఆర్ఆర్ అవార్డు అందుకునే సమయంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ లు కూడా విదేశాలకు వెళ్ళినప్పుడు అక్కడ వారు ఇంగ్లీష్ యాక్సెంట్ అనుకరించడం వల్ల బాగా ట్రోల్స్ కు గురయ్యారు. కేవలం వీరిద్దరే కాకుండా మరి కొంతమంది సెలబ్రిటీలు కూడా ట్రోల్స్ కు గురయ్యారు. ఇంతకు వాళ్ళు ఎవరంటే..
ఐశ్వర్యరాయ్: ఐశ్వర్యరాయ్ గతంలో కేన్స్ రెడ్ కార్పెట్ పై మీడియాతో మాట్లాడుతున్న సమయంలో ఆమె యాక్సెంట్ ను ఫేక్ చేసింది అంటూ విమర్శలు వచ్చాయి.
ప్రియాంక చోప్రా: బాలీవుడ్ నుండి హాలీవుడ్లో సెటిల్ అయినా ప్రియాంక చోప్రా అక్కడి ఇంటర్వ్యూలలో పాల్గొన్నప్పుడు ఆమె కూడా యాక్సెంట్ ను ఫేక్ చేసిందని తెలిసింది.
అనిల్ కపూర్: బాలీవుడ్ స్టార్ అనిల్ కపూర్ స్లం డాగ్ మిలియనీర్ సినిమా విడుదల సమయంలో కూడా యాక్సెంట్ పై విమర్శలు ఎదుర్కొన్నట్లు తెలిసింది.
సమంత: టాలీవుడ్ బ్యూటీ సమంత అమెరికన్ టీవీ సిరీస్ సిటాడెల్ ప్రీమియర్ షో కోసం లండన్ కి వెళ్ళగా ఆమె కూడా యాక్సెంట్ పై టోల్స్ ఎదుర్కుంది.
కరీనాకపూర్: బాలీవుడ్ బ్యూటీ కరీనాకపూర్ రెడ్ సీ ఫిలిం ఫెస్టివల్ కు పాల్గొన్నప్పుడు అక్కడ ఆమె యాక్సెంట్ ని ఫేక్ చేయటం వల్ల బాగా ట్రోల్స్ ఎదుర్కొంది. ఇక వీరందరికీ సంబంధించిన వీడియోలు బాగా వైరల్ అవుతున్నాయి.