Chandrababu: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అధికార పార్టీ అధినేత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగారు. ఎన్నికలు సమీపిస్తున్నటువంటి తరుణంలో జగన్మోహన్ రెడ్డిలో తెలియని భయం మొదలైందని తెలిపారు. ఆయన ముఖంలో ఓటమి కనిపిస్తోందని అందుకే ఎలాగైనా ఓట్లను చేర్చడం కోసం ఈయన కులమత రాజకీయాలను చేయడం ప్రారంభించారంటూ చంద్రబాబు నాయుడు తెలిపారు.
తెలుగుదేశం పార్టీ బిజెపితో పొత్తు పెట్టుకోవడంతో జగన్మోహన్ రెడ్డి కుల రాజకీయాలను తెరపైకి తీసుకువచ్చారు. బిజెపి ముస్లింలకు వ్యతిరేకమని వారు వస్తే రిజర్వేషన్లు కూడా పోతాయని అంతేకాకుండా ముస్లింలకు తీవ్రంగా అన్యాయం జరుగుతుందంటూ జగన్మోహన్ రెడ్డి ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ ఓట్లు చీల్చే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు.
ముస్లింలకు మేలు చేసింది, చేసేదీ తెలుగుదేశం పార్టీనేనని తెలిపారు. తమ ప్రభుత్వంలో రంజాన్ తోఫా, షాదీ ముబారక్ వంటి అనేక కార్యక్రమాలతో మైనారిటీలకు అండగా ఉందని తెలిపారు. బీజేపీ కూడా మైనారిటీలకు వ్యతిరేకం కాదన్నారు. బీజేపీని కులం పేరుతో, మతం పేరుతో చూసే రోజులు పోయాయని.. బీజేపీ పుంజుకోవడానికి పార్టీలో తీసుకువచ్చిన సంస్కరణలేనని చంద్రబాబు చెప్పారు. కానీ, తాము బీజేపీతో పొత్తు పెట్టుకోగానే.. వైసీపీ ఒంట్లో వణుకు పుట్టిందన్నారు.
జగన్మోహన్ రెడ్డిలో ఓటమి భయం స్పష్టంగా కనబడుతుంది వచ్చే ఎన్నికలలో కూటమిగా ఎన్నికల బరిలోకి దిగి ఈ రాక్షస పాలనను అంతమందిస్తామని, నరకాసురుడు లాంటి ముఖ్యమంత్రిని గద్ద దింపడం కోసమే తాము పొత్తు పెట్టుకున్నామని ఎవరు కూడా జగన్ చేసే కులమత రాజకీయాల ప్రలోభలో పడొద్దు అంటూ ఈయన మైనారిటీలను ఉద్దేశిస్తూ చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.