Chandrababu: జగన్ మాదిరిగా రూ.10 ఇచ్చి రూ.100 లాగడం మేం చేయం.. చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు!

Chandrababu: ఎన్నికల ప్రచార కార్యక్రమాలలో భాగంగా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు కుప్పం నియోజకవర్గంలో పర్యటించారు. ఇలా కుప్పంలో పర్యటించినటువంటి ఈయన తమ ప్రభుత్వాన్ని గెలిపించాలని కోరడమే కాకుండా ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.

రాష్ట్రంలో చీకటి వ్యాపారాలు పెరిగిపోయాయని అందుకే డ్రగ్స్ రాష్ట్రంలోకి వస్తున్నాయని చంద్రబాబు నాయుడు విమర్శలు చేశారు. డబ్బు కోసం కక్కుర్తి పడి డ్రగ్స్ అమ్మే పరిస్థితికి వైసీపీ నేతలు వచ్చారని తెలిపారు. తమ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి అక్రమాలు రాష్ట్రంలోకి వచ్చాయా అంటూ ఈయన ప్రశ్నించారు.

కూటమి అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి చూపిస్తానని మహిళల ఆదాయం రెట్టింపు అయ్యేలా చేస్తానని చంద్రబాబు నాయుడు తెలిపారు. సీఎం జగన్ మాదిరి మేము పది రూపాయలు ఇచ్చి మీ దగ్గర నుంచి 100 రూపాయలు లాగడం మేం చేయలేమని తెలిపారు. సంపదను సృష్టించి ఆదాయం రెట్టింపు అయ్యేలా చేస్తామని తెలిపారు.

అధికారంలోకి వస్తే ఆడబిడ్డ నిధి కింద నెలకు రూ.1500 అకౌంట్ లో వేస్తాం అని చంద్ర‌బాబు హామీ ఇచ్చారు. మహిళలు ఆర్థికంగా పైకి రావాలంటే ఇంటికి 2 ఆవులు ఇవ్వాలనుకున్నామని.. అప్పుడు దీనిపై అవహేళన చేశారని చంద్రబాబు గుర్తు చేశారు. ఈ ప్రభుత్వం కల్తీ మద్యం అమ్ముతూ ఆడబిడ్డలకు మంగళసూత్రాలు దూరం చేస్తుందని, అదే మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తక్కువ ధరకే నాణ్యమైనటువంటి మద్యం ఆములలోకి తీసుకువస్తామంటూ చంద్రబాబు నాయుడు తెలియజేశారు.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: చిరు జీవులకు సైతం అన్యాయం చేసిన జగన్ సర్కార్.. మరీ ఇంతలా మోసమా?

CM Jagan: జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున రాష్ట్రంలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున దోపిడీలు చేస్తున్నారు వైకాపా నేతలు కొండలను గుట్టలను చెరువులను వదలలేదు పెద్ద...
- Advertisement -
- Advertisement -