Chandrababu Naidu: జగన్ రెడ్డీ ప్లేస్, టైమ్ నువ్వే చెప్పు.. బాబు ఛాలెంజ్ కు జగన్ రెడ్డి స్పందించడం సాధ్యమేనా?

Chandrababu Naidu:  జగన్ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ ప్రారంభమైందని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ తీరుపై విమర్శలు కురిపించారు. రెక్కలు విరిగిపోయినటువంటి ఫ్యాన్ బయటపడేడానికి ప్రజల సిద్ధంగా ఉన్నారని ఈయన తన ట్విట్టర్ ద్వారా జగన్మోహన్ రెడ్డి పై చాలెంజ్ విసురుతూ చేసినటువంటి కామెంట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

అభివృద్ధి పాలన ఎవరిది విధ్వంసపు పాలన ఎవరిది అనే విషయాల గురించి చర్చిద్దాం. దమ్ముంటే నాతో బహిరంగ సభకు సిద్ధమేనా అంటూ చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డికి సవాల్ విసిరారు. బాదుడు పాలనతో ప్రజల రక్తం పీల్చి విధ్వంసపు పోకడలతో రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చేశారు. ఇప్పుడు మాత్రం ర్యాంప్ వాక్ చేస్తూ అబద్దాలు చెబితే ప్రజలు ఎలా నమ్ముతారు జగన్మోహన్ రెడ్డి అంటూ చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు.
నీ పరిపాలన వల్ల ప్రజలు విసుగు చెందారని నీకు నీ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ ప్రారంభమైందని కేవలం 50 రోజులు మాత్రమే ఉన్నాయని వరమిచ్చిన శివుడినే భస్మం చేయాలనుకునే బస్మాసురుడికి ఎలాంటి గతి పట్టిందో నీకు కూడా అదే గతి పడుతుంది అంటూ చంద్రబాబు నాయుడు ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి పై విమర్శలు కురిపించారు.

ఏ ప్రభుత్వంలో ఎవరి పాలన ఎలా ఉంది అనే విషయాలను చర్చించడానికి అభివృద్ధి విషయంపై చర్చించడానికి సిద్ధమా. దమ్ముంటే నాతో బహిరంగ సభకు రా టైం ప్లేస్ ఎక్కడ అనేది నువ్వే ఫిక్స్ చెయ్ నేను ఎక్కడికైనా వస్తా.. దేని మీదైనా చర్చిస్తాం అందుకు నువ్వు సిద్ధమా జగన్ రెడ్డి అంటూ చంద్రబాబు నాయుడు చాలెంజ్ చేశారు ప్రస్తుతం ఇందుకు సంబంధించినటువంటి ఈ ట్వీట్స్ వైరల్ అవుతున్నాయి.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: చిరు జీవులకు సైతం అన్యాయం చేసిన జగన్ సర్కార్.. మరీ ఇంతలా మోసమా?

CM Jagan: జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున రాష్ట్రంలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున దోపిడీలు చేస్తున్నారు వైకాపా నేతలు కొండలను గుట్టలను చెరువులను వదలలేదు పెద్ద...
- Advertisement -
- Advertisement -