Rajinikanth: చంద్రబాబు గొప్ప పోరాట యోధుడు.. ఆయన తప్పు చేయరు.. రజనీకాంత్ ఏమన్నారంటే?

Rajinikanth: సూపర్ స్టార్ రజనీకాంత్ గురించి మనందరికీ తెలిసిందే. తెలుగు తమిళంలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించి భారీగా క్రేజ్ ని,ఫాన్స్ ఫాలోయింగ్ ని ఏర్పరచుకున్నారు. కాగా రజనీకాంత్ కు దేశ వ్యాప్తంగా ఏ రేంజ్ లో అభిమానులు ఉన్నారో మనందరికీ తెలిసిందే. అందరూ ఆయనను అజాత శత్రువుగా చెబుతారు. అందరితో మంచిగా ఉంటారు. పరుష వాక్యం అన్నది ఆయన నోటి నుంచి రాదు. రాజకీయాల లోకి ఎంట్రీ ఇద్దామని ఆయన భావించి కూడా రాజకీయాలు తన నైనాజికి సరిపడవన్న భావనో లేదా మరేదైనా కారణమో తెలియదు కానీ ఆయన రాజకీయాల్లోకి మాత్రం రాలేదు.

సినిమాలకు సంబంధించిన విషయాల గురించి మాత్రమే స్పందించే రజినీకాంత్ రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉంటారని చెప్పవచ్చు. అటువంటి రజనీకాంత్ ను ఏపీ లోని వైసీపీ పార్టీ వివాదంలోకి లాగింది. ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ.. ఆయన ఎన్టీఆర్ ను యుగపురుషుడిగా, తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడిని విజనరీగా అభివర్ణించారు. చంద్రబాబు కారణంగానే హైదరాబాద్ లో ఐటీ అభివృద్ధి చెందిందని అన్నారు. హైదరాబాద్ వెళితే భారతదేశంలో ఉన్నామా? న్యూయార్క్ లో ఉన్నామా? అనిపించేలా అభివృద్ధి జరిగిందనీ, అందంతా చంద్రబాబు విజన్ వల్లే సాధ్యమైందని తెలిపారు.

అలాగే తనకు చంద్రబాబుతో తనకు మూడు దశాబ్దాల స్నేహబంధం ఉందనీ, తన ప్రతి పుట్టిన రోజుకు చంద్రబాబు ఫోన్ చేసి శుభాకాంక్షలు చెబుతారనీ రజనీకాంత్ ఆ సందర్భంగా తెలిపారు రజినీకాంత్. అయితే ఆ ప్రసంగంలో రజనీకాంత్ ఎక్కడా రాజకీయ వ్యాఖ్యలు చేయలేదు. కానీ చంద్రబాబును ప్రశంసించడమే ఆయన చేసిన పాపం అన్నట్లుగా వైసీపీ రజనీకాంత్ పై విమర్శల వర్షం కురిపించింది. మంత్రి రోజా, మాజీ మంత్రి కొడాలి నాని, నటుడు కమ్ పొలిటీషియన్ పోసాని కృష్ణ మురళి వంటి వారు రజనీకాంత్ పై అనుచిత వ్యాఖ్యలతో విమర్శలు గుప్పించారు. నువ్వు హీరోవా అంటూ హేళన చేశారు. దేశ విదేశాల్లో ఉన్న రజనీకాంత్ అభిమానులందరికీ ఆగ్రహం కలిగించారు.

అయినా అప్పటికి రజనీకాంత్ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కానీ మేధావులూ, సామాన్యులూ కూడా రజనీకాంత్ పై వైసీపీ చేసిన అనుచిత వ్యాఖ్యలను తప్పుపట్టారు. అయితే అప్పటికి ఊరుకున్న రజనీకాంత్ తన చిత్రం జైలర్ సినిమా వేడుకలో మాత్రం మొరగని కుక్కలేదు.. విమర్శించని నోరు లేదు.. ఇవి రెండూ జరగని ఊరు లేదు.. మనం మన పని చూసుకుంటూ పోతూనే ఉండాలి. అర్థమైందా రాజా.. అంటూ వైసీపీ వారికి చురకలు అంటించారు. డైలాగ్ అంతా తమిళంలో చెప్పిన రజనీకాంత్ చివరిలో మాత్రం అర్థమైందా రాజా అని తెలుగులో చెప్పారు. పోసాని మాట్లాడితే రాజా రాజా అంటుంటారు కాబట్టి పోసానికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చే విధంగా అర్థమయిందా రాజా అని వైసీపీ నాయకులకు నెమ్మదిగా మాట్లాడుతునే చురుకులు అంటించారు రజినీకాంత్.

ఇది ఇలా ఉంటే తాజాగా రజనీకాంత్ చంద్రబాబు అరెస్టు పై స్పందించారు. తన మిత్రుడు చంద్రబాబు గొప్ప పోరాట యోధుడు, ఆయన ప్రజా శ్రేయస్సు కోతం నిరంతరం పరితపించే గొప్ప నాయకుడు అని ప్రశంసించారు. చంద్రబాబు కుమారుడు లోకేష్ కు ఫోన్ చేసి ధైర్యం చెప్పారు. తప్పుడు కేసులు, అక్రమ అరెస్టులు ఆయనను ఏం చేయలేవని ధైర్యంగా ఉండమని, చంద్రబాబు చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే ఆయనకు శ్రీరామరక్ష అంటూ లోకేష్ కు ధైర్యం చేప్పారు. తన స్నేహితుడు చంద్రబాబు తప్పు చేయరని, ఆయన చేసిన మంచి పనులు, నిస్వార్థ ప్రజా సేవే ఆయనను క్షేమంగా బయటకు తీసుకువస్తాయని అన్నారు రజినీకాంత్.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: జనసేన పార్టీ నేతలకు కీలక ఆదేశాలు ఇచ్చిన పవన్ కళ్యాణ్.. ఆ నేతలు పాటిస్తారా?

Pawan Kalyan:  పవన్ కళ్యాణ్ లో ఇప్పుడు పరిపూర్ణ రాజకీయ నాయకుడు కనిపిస్తున్నాడు. పార్టీకి సంబంధించి అనేకమైన కీలక నిర్ణయాలను చాలా పరిణితితో తీసుకుంటున్నారు. పోలింగ్ రెండు వారాల్లో ఉంది కాబట్టి ఈ...
- Advertisement -
- Advertisement -