Bandlanna: చంద్రబాబు పరువు పోయేలా బండ్లన్న ట్వీట్.. ఏమైందంటే?

Bandlanna: చంద్రబాబు నాయుడు వచ్చే ఎన్నికలలో ఎలాగైనా అధికారం అందుకోవాలనే ఉద్దేశంతో అధికారంలోకి రావడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలా వచ్చే ఎన్నికలలో జగన్ ను గద్దె దించి అధికారం అందుకోవాలని ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు ఇతర పార్టీలతో పొత్తులకి కూడా సిద్ధమయ్యారు.అయితే గతంలో బిజెపి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేసినటువంటి చంద్రబాబు నాయుడు వచ్చే ఎన్నికలలో పొత్తుకు సిద్ధమయ్యారు.

ఈ క్రమంలోనే ఈయన ఈ మధ్యకాలంలో ఎక్కడికి వెళ్లినా బిజెపి పార్టీని పొగుడుతూ మోడీ భజన చేస్తున్నారు. అయితే తాజాగా ఈయన కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిశారు. చంద్రబాబు నాయుడు అమిత్ షా అని కలవడంతో బిజెపితో పొత్తుకు సిద్ధమయ్యారన్న వార్తలు వైరల్ గా మారడంతో పలువురు ఈ విషయంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. చివరికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా చంద్రబాబు వ్యవహారంపై అసంతృప్తితోనే ఉన్నారని చెప్పాలి.

 

ఇలా చంద్రబాబు నాయుడు అమిత్ షా ని కలవడంతో బండ్ల గణేష్ సోషల్ మీడియా వేదికగా చేసినటువంటి ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇది కర్మ కాకపోతే ఇంకేంటి ఆయన సిపిఎం అంటే మనం సిపిఎం అనాల్సిందే. కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ అని జనసేన అంటే జనసేన అని, ఆయనకు సౌకర్యవంతంగా ఉన్నటువంటి పేరు చెబితే మనం కూడా అదే పలకాలి అంతేగాని ఎవరికి ఆత్మాభిమానం మంచి, చెడు మానవత్వం ఉండదు. ఆయన పొగిడితే జాతిని పొగిడినట్టే, లేకపోతే జాతికి ద్రోహం చేసినట్లే ఇంతకన్నా దరిద్రం ఏం కావాలి అంటూ ఈయన ట్వీట్ చేశారు.

 

బండ్ల గణేష్ చేసినటువంటి ఈ ట్వీట్ లో ఎక్కడ కూడా చంద్రబాబు నాయుడు పేరు ప్రస్తావనకు తీసుకురాలేదు.
తెలుగుదేశం-భాజపా పొత్తు మీద వేరే వాళ్లు వేసిన కామెంట్ కు బదులుగా ఈ కామెంట్ పెట్టారు కనుక దానికి రిలేటెడ్ నే అనుకోవాలి.ఏది ఏమైనా పరోక్షంగా చంద్రబాబు నాయుడుని ఉద్దేశిస్తూ బండ్ల గణేష్ చేసినటువంటి ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

 

Related Articles

ట్రేండింగ్

CM Jagan: కూటమి విజయాన్ని ఫిక్స్ చేసిన జగన్.. మేనిఫెస్టో హామీలతో బొక్కా బోర్లా పడ్డారా?

CM Jagan: త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో నిర్వహిస్తున్నారు. అయితే వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటూ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు....
- Advertisement -
- Advertisement -