Mantra: ఈ మంత్రం జపిస్తే కోరిన ప్రతి కోరిక తీరుతుందా.. ఏం చేయాలంటే?

Mantra: మనిషి అన్న తర్వాత ప్రతి ఒక్కరికి ఎన్నో కోరికలు ఉంటాయి ప్రతి ఒక్కరు కూడా వారు కోరుకున్న కోరికలు నెరవేరాలని భావిస్తూ ఉంటారు. కోరుకున్న కోరికలు నెరవేరాలి అంటే మనం మనస్ఫూర్తిగా ఆ విష్ణు దేవుడిని నమస్కరిస్తూ ఈ మంత్రాన్ని జపిస్తే చాలు మనం కోరిన ప్రతి కోరిక తీరుతుంది. మరి మనం జపించాల్సిన ఆ మంత్రం ఏంటి అనే విషయానికి వస్తే..ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని చదివితే చాలు మనం కోరుకున్న కోరికలు నెరవేరుతాయి

పురాణాల ప్రకారం కలిపురుషుడు గంగా నది తీరాన కూర్చుని ఈ మంత్రాన్ని చదువుతున్నారు. అయితే ఆ ముసలాయన మంత్ర జపాన్ని ఆపాలని కలి అతనిని తాకబోయారట. దీంతో అర కిలోమీటర్ దూరం ఎగిరిపడ్డారు. ఇలా కలిపురుషుడు అంత దూరం ఎగిరి పడటంతో ఏం జరిగిందో తనకు అర్థం కాలేదు చూస్తే ముందర ముసలాయన ఆ మంత్రాన్ని జపిస్తూ ఉన్నారు. దీంతో కోప్పడినటువంటి కలి ఎలాగైనా ఈ మంత్రాన్ని చెడగొట్టాలని ముందుకు వెళ్తే మరోసారి మరింత దూరం ఎగిరి పడ్డారట.

 

దీంతో భయపడినటువంటి కలిపురుషుడు అక్కడి నుంచి ప్రాణభయంతో వెళుతూ ఉండగా వేద వ్యాసుడు ఎదురవుతారు. ఆయనకు నమస్కరించిన కలి నాకు కొన్ని సందేహాలు ఉన్నాయని చెబుతాడు. మీరు ఈ కలిపురుషుడు అలాంటిది మీకు నాతో పనేమిటి అని వేద వ్యాసుడు ప్రశ్నించారు. దీంతో కలిపురుషుడు జరిగినది మొత్తం చెబుతాడు.

 

ఈ విధంగా కలి చెప్పిన మాటలు విన్నటువంటి వేద వ్యాసుడు మీ సమస్య నాకు అర్థమైంది ఆయన చూడటానికి ముసలాయన అయినప్పటికీ ఆయన జపిస్తున్న మంత్రం చాలా పవిత్రమైనది శక్తివంతమైనది.
ఆయన జపించే నామం వల్ల విష్ణు శక్తి ఉత్పన్నమై, నిన్ను దగ్గరికి రానివ్వడం లేదు. విష్ణువు నిన్ను నాశనం చేసి కలియుగమే లేకుండా చేస్తాడు. త్రికరణ శుద్ధిగా ఓం నమో భగవతే వాసుదేవాయ అనే నామాన్ని ఎవరైతే చదువుతూ ఉంటారు వారి కోరికలు నెరవేరుతాయని వేద వ్యాసుడు తెలియజేశారు. అందుకే ఈ నామం చదివిన ఈ కథ విన్న తప్పకుండా కోరికలు నెరవేరుతాయట.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -