Ram Charan: టాలీవుడ్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో రూపొందుతున్న సినిమా గేమ్ చేంజర్. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. రామ్ చరణ్ పాన్ ఇండియా హీరోగా మారిన తర్వాత వస్తున్న మొట్టమొదటి సినిమా కావడంతో ఈ సినిమాపై భారీగా అంచనాలను నెలకొన్నాయి. దానికి తోడు ఈ సినిమాకు శంకర్ దర్శకుడు కావడంతో ఆ అంచనాలు మరింత పెరిగాయి. దీంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని మెగా అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.
ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, టీజర్ ఈ సినిమాపై అంచనాలను మరింత పెంచేసాయి. ఈ సినిమా అప్డేట్స్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మూవీ మేకర్స్ కూడా ఎప్పటికప్పుడు ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్లను విడుదల చేస్తూ ప్రేక్షకులలో ఆత్రుతను మరింత పెంచుతున్నారు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో ఆసక్తికర అప్డేట్ చక్కర్లు కొడుతోంది. అదేమిటంటే ఇందులో యాక్షన్ సన్నివేశాలు భారీ స్థాయిలో తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది. మరి ముఖ్యంగా క్లైమాక్స్ సన్నివేశం సినిమాకి హైలెట్ గా నిలవనుంది అంటూ వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.
దాదాపుగా 1200 మంది ఫైటర్స్ తో పోరాట సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్టు తెలుస్తోంది. కాగా ఇందుకోసం హైదరాబాద్ శివారు ప్రాంతంలో సెట్స్ కూడా వేసినట్లు తెలుస్తోంది. మూడు వారాల పాటు క్లైమాక్స్ సీన్ ను చిత్రీకరించనున్నారట. ఇందులో ఫైట్ మాస్టర్స్తో పాటు కేజీయఫ్ సినిమా కోసం పనిచేసిన వారు కూడా పాల్గొనబోతున్నారు అంటూ వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. ఇందులో రామ్ చరణ్ ద్విపాత్రాభినయంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇకపోతే ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తున్న విషయం తెలిసిందే. అలాగే ఈ సినిమాలో శ్రీకాంత్, అంజలి, ఎస్.జే.సూర్య, సునీల్ తదితరులు కీలకపాత్రల్లో నటిస్తున్నారు.