Ram Charan: తెలుగు సినీ ప్రపంచ పటం మీద ఎగిరింది. మొత్తానికి ఆర్ఆర్ఆర్ చిత్రానికి ఆస్కార్ లభించింది. చిత్రబృందంతో పాటు ఇండియా మొత్తం ఈరోజు పండగ చేసుకుంటున్న సంగతి. 95వ ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవ వేడుకల్లో నాటునాటు పాటకు గాను బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డు దక్కింది. రిహానా వంటి హాలీవుడ్ పాపులర్ సింగర్స్ పాడిన పాటలు పోటీలో ఉన్నప్పటికీ వాటన్నింటినీ వెనక్కి నెట్టింది తెలుగు పాట.
నాటు నాటుకు కీరవాణి బాణీలు అందించగా అతని తనయుడు కాలభైరవ అలాగే బిగ్ బాస్-3 విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ కలిసి పాటని ఎంతో హుషారెత్తించే విధంగా ఆలపించారు. చంద్రబోస్ లిరిక్స్ అందించగా ప్రేమ్ రక్షిత్ సినిమాటోగ్రఫీ అందించారు. రాంచరణ్, ఎన్టీఆర్ వేసిన స్టెప్పులు ఈ పాటను నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్లినట్టు మనం చెప్పుకోవచ్చు. అయితే ఆస్కార్ గెలిచిందన్న వార్త బయటకు వచ్చిన వెంటనే చరణ్, ఎన్టీఆర్ ట్విట్టర్లో తమ ఆనందాన్ని పంచుకుంటూ ట్వీట్స్ వేశారు.
అయితే ఎన్టీఆర్ ట్వీట్ చర్చనీయాంశైంది. ఎందుకంటే అతను రాంచరణ్ పేరును ట్యాగ్ చేయలేదు. ఆస్కార్ గురించి అతను రెండు ట్వీట్లు వేయగా రెండిటిలో చరణ్ పేరును ప్రస్తావించలేదు. కానీ చరణ్ మాత్రం ఎన్టీఆర్ ను ట్యాగ్ చేశాడు. పది రోజులుగా విదేశాల్లో ఉన్న రాంచరణ్ తాను ఎక్కడ ఇంటర్వ్యూ ఇచ్చినా తారక్ గురించి గొప్పగా చెబుతున్నాడు. కానీ ఎన్టీఆర్ మాత్రం పలుమార్లు చరణ్ పేరును స్కిప్ చేయడం జరిగింది.
సంగీత దర్శకుడు కీరవాణి ఆస్కార్ అవార్డుల వేదిక పై స్పీచ్ ఇస్తున్న టైంలో వెనుక ఎన్టీఆర్ ఫోటోను చూపించారు. కానీ చరణ్ ఫోటో అక్కడ కనిపించలేదు. ఇలాంటి విషయాలు చరణ్ అభిమానులను ఇబ్బంది పెట్టడమే కాకుండా పెద్ద ఎత్తున చర్చనీయాంశమయ్యాయి అని చెప్పొచ్చు.