Chennai: పెళ్లికి ఒప్పుకోని పెద్దలు.. ప్రేమ జంట తీసుకున్న నిర్ణయం తెలిస్తే షాకవ్వాల్సిందే!

Chennai: ఈ మధ్యకాలంలో ప్రేమ పెళ్లిళ్లు ఎక్కువ అయ్యాయి. యువత ప్రేమించుకోవడం తల్లిదండ్రులు ఒప్పుకోలేదని పారిపోయి పెళ్లి చేసుకోవడం లేదంటే సూసైడ్ చేసుకోవడం లాంటివి చేస్తున్నారు. ఇటీవల కాలంలో ఇలాంటి ఘటనలే ఎక్కువగా వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా అలాంటి ఘటనే మరొకటి వెలుగులోకి వచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళితే… ఇప్పుడు మనం తెలుసుకోబోయే సంఘటన తమిళనాడులోని చెన్నైలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చెన్నై అంపతూర్‌కు చెందిన ప్రముఖ వ్యాపార వేత్త లతిపరి కూతురు దీపిక ప్రైవేట్‌ కాలేజీలో సెకండ్‌ ఇయర్ ఇంజనీరింగ్‌ చదువుతోంది.

అదే ప్రాంతానికి చెందిన గౌతమ్‌ అనే యువకుడితో పరిచయం అయింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. అయితే ఇద్దరు పెళ్లి చేసుకోవాలనుకున్నారు. ప్రేమ విషయం ఎవరిళ్లలో వాళ్లు చెప్పారు. అయితే, దీపిక తండ్రి లతిపరి వారి పెళ్లికి ఒప్పుకోలేదు. వేరు వేరు కులాలు కావటంతో అభ్యంతరం వ్యక్తం చేశాడు. అయితే, కులం కారణంగా తమ ప్రేమ ఓడిపోకూడదని దీపిక భావించింది. గౌతమ్‌ కోసం ఇంట్లోంచి వెళ్లిపోయింది. గౌతమ్‌ దగ్గరకు చేరుకుంది. కూతురు గౌతమ్‌ను పెళ్లి చేసుకోకుండా ఆపాలని తండ్రి భావించాడు. పోలీసులను రంగంలోకి దింపి కూతురు ఎక్కడ ఉన్నా తీసుకురమ్మన్నాడు. ఈ విషయం తెలుసుకున్న ప్రేమ జంట కోర్టును ఆశ్రయించింది. లతపరి నుంచి తమకు ప్రాణ హాని ఉందని ఫిర్యాదు చేసింది. తమకు ఎలాగైనా పెళ్లి చేయమని కోరింది. జడ్జి ఆదేశాల మేరకు వారికి అక్కడే పెళ్లయింది. ఈ జంటకు రక్షణ కల్పించాలని కోర్టు పోలీసులను ఆదేశించింది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -