Chennai: వేశ్యని పెళ్లి చేసుకున్న వ్యక్తి.. ఆమె మరో ముగ్గురితో అలా?

Chennai: చెన్నైలోని ఒక ప్రాంతంలో జయంతన్ అనే యువకుడు నివసిస్తున్నాడు. అతను చెన్నై ఇంటర్‌నేషనల్ ఎయిర్‌ పోర్ట్‌లో థాయ్‌ ఎయిర్‌ వేస్‌ లో స్టాఫ్ గా పని చేస్తుండేవాడు. అయితే జయంతన్ కి 2020 లో తంబారంలో జయలక్ష్మి అనే యువతితో పరిచయం ఏర్పడింది. వీరి పరిచయం కాస్త ప్రేమగా మారింది. జయంతన్ ఆమె ఎవరు, ఏంటి అనే ఏ వివరాలు తెలుసుకోకుండా ఆమెను పిచ్చి పిచ్చిగా ప్రేమించాడు. అలా కొన్నాళ్ల పాటు వీరి ప్రేమాయణం కొనసాగింది. కొంత కాలం తర్వాత ఈ ప్రేమికులు ఒక గుడిలో పెళ్లి చేసుకున్నారు.

 

ప్రేమించిన అమ్మాయినే పెళ్లి చేసుకోవడంతో జయంతన్ ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. పెళ్లయ్యేంతవరకు కూడా జయలక్ష్మి తాను వేశ్య అన్న విషయాన్ని జయంతన్ కు చెప్పలేదు. 2021 జనవరిలో జయలక్ష్మి వేశ్య అని భర్త జయంతన్ కు తెలిసింది. ఈ విషయం తెలుసుకున్న భర్త జయంతన్ ఆమెను నిలదీశాడు. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య గొడవ జరిగింది. దీంతో అప్పటి నుంచి ఇద్దరూ విడిపోయారు. అయితే మార్చి 18న జయలక్ష్మి జయంతన్ కి ఫోన్ చేసి మాట్లాడాలి అని చెప్పడంతో సరే అని జయంతన్ ఆమె చెప్పిన చోటుకు వెళ్లాడు. తీరా అక్కడికి వెళ్లాక ఇద్దరి మధ్య మరోసారి గొడవ జరిగింది.

దీంతో జయలక్ష్మి తనకు తెలిసిన ముగ్గురు వ్యక్తులను అక్కడికి వెంటనే రమ్మని కబురు పంపింది. క్షణాల్లో వాళ్లు అక్కడి వాలిపోయారు.

అనంతరం జయలక్ష్మి చెప్పినట్లుగా ఆ ముగ్గురు దుండగులు జయంతన్ ని అతి దారుణంగా హత్య చేసి అతని కాళ్లు, చేతులు, తల, మొండం వేరుగా చేశారు. ఇక గత నెల 20న నరికిన జయంత్ కాళ్లు, చేతులు ప్లాస్టిక్ బ్యాగులో తీసుకుని చెన్నైలోని కోవలం దగ్గర కాల్చి వేశారు. అదే ప్రదేశంలో మిగతా శరీర భాగాలైన తల, మొండాన్ని 400 మీటర్ల లోతుతో పాతి పెట్టి అక్కడి నుంచి పుదుకొట్టయ్ కు వెళ్లారు. అయితే ఉన్నట్టుండి జయంతన్ కనిపించకపోవడంతో అతని కుటుంబ సభ్యుల మార్చి 21న పోలీసులకు ఫిర్యాదు చేశారు.

 

మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు జయంతన్ ఆచూకి గురించి గాలింపు చర్యలు చేపట్టారు. ఇక పోలీసుల విచారణలో భాగంగా భార్య జయలక్ష్మిని కూడా అదుపులోకి విచారించారు. అప్పుడు జయలక్ష్మి సంచలన విషయాలను వెల్లదించిండి. తన భర్త జయంతన్ ను తానే చంపిన విషయాన్ని ఆమెనే స్వయంగా ఒప్పుకుంది. నా ప్రియుడిని కొంతమందితో కలిసి హత్య చేశానని, ఆ తర్వాత అతని కాళ్లు, చేతులను కాల్చేసి, మిగతా శరీర భాగాలను కోవలంలోని ఓ ప్రదేశంలో పాతిపెట్టామని నిందితురాలు జయలక్ష్మి ఒప్పుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఆమె చెప్పిన వివరాలు విన్న జయంతన్ కుటుంబ సభ్యులు, పోలీసులు ఒక్కసారిగా షాక్ గురయ్యారు. అనంతరం పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు జయలక్ష్మిని అరెస్ట్ చేసి మిగతా నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -