Srikakulam: ఛీఛీ.. భర్త స్నేహితుడి కోసం అలాంటి పని చేసిన వివాహిత?

Srikakulam: ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం వరిశాం గ్రామంలో జీరు బాలకృష్ణ అనే 36 ఏళ్ల వ్యక్తి 13 ఏళ్ల కిందట ఒక మహిళల వివాహం చేసుకున్నాడు. పెళ్లయిన తర్వాత చాలా ఏళ్ళ పాటు భార్యాభర్తలు ఎంతో అన్యోన్యంగా ప్రేమగానే ఉన్నారు. ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలు కూడా జన్మించారు. అయితే భర్త పెయింటింగ్ పనికి వెళ్తుండగా, భార్య గ్రామంలో చిన్న చిన్న పనులకు వెళ్తూ ఉండేది. ఈ క్రమంలోనే బాలకృష్ణ భార్య అతని స్నేహితుడైన వెంకటరమణ పై మోజు పడి గత కొంత కాలంగా భర్త బాలకృష్ణకు తెలియకుండా వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తూ వస్తోంది. ఇక ఎట్టకేలకు ఆ విషయం భర్త బాలకృష్ణకు తెలియడంతో భార్యని తన పద్ధతిని మార్చుకోమని మందలించాడు.

 

అయినప్పటికీ తన తీరని మార్చుకొని ఆమె తన భర్తతో కాకుండా ప్రియుడు వెంకటరమణ తో ఉండడానికి ఇష్టపడింది. అసమయంలో తనకు ఏం చేయాలో తెలియక ఎలా అయినా తన భర్త అడ్డు తొలగించుకోవాలి తన భర్తను చంపేయాలి అనుకుంది. ఆ విషయాన్ని వెంకటరమణకు చెప్పడంతో వెంకటరమణ కూడా అందుకు సరే అని అన్నాడు. ఇద్దరు కలిసి బాలకృష్ణ చంపడానికి ప్లాన్ కూడా వేశారు. ఈ ప్లాన్ లో భాగంగా తాజాగా వెంకటరమణ తన స్నేహితులు కొందరు కలిసి పార్టీ చేసుకుందామని బాలకృష్ణకు చెప్పడంతో బాలకృష్ణ సరే అన్నాడు. ఇక అందరూ కలిసి ఆదివారం రాత్రి 10 గంటల వరకు ఊళ్లోని ఓ నిర్మానుష్య ప్రాంతంలో మద్యం సేవించారు. అనంతరం వెంకట రమణ అతని స్నేహితులతో కలిసి బాలకృష్ణపై దాడికి దిగారు. వీరి దాడిలో బాలకృష్ణ అక్కడికక్కడే మరణించాడు.

 

ఆ తర్వాత అందరూ కలిసి అతడి మృతదేహాన్ని అక్కడే ఉన్న చెట్ల పొదాల్లో విసిరేసి ఎవరి దారిన వారు వెళ్లిపోయారు. ఉదయం కొందరు స్థానికులు బాలకృష్ణ మృతదేహాన్ని గమనించి అతని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. భర్తను ఆ స్థితిలో చూసిన బాలకృష్ణ భార్య రాక్షస ప్రేమను చూపిస్తూ మొసలి కన్నీరు కార్చింది. ఆ సంఘటనపై కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం ఆస్పత్రికి తరలించారు. పోలీసులు వారి స్టైల్ లో అన్ని కోణాలలో విచారణ జరపగా ఎట్టకేలకు నిందితులైన బాలకృష్ణ భార్య అలాగే ఆమె ప్రియుడు వెంకటరమణ దొరికిపోయారు. వారీతో పాటుగా బాలకృష్ణ హత్యకు కారణమైన వెంకటరమణ స్నేహితులను కూడా పోలీసులు అరెస్టు చేశారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -