China: తాజా అధ్యయనాల ప్రకారం ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశాలలో భారతదేశం మొదటి స్థానంలో నిలిచింది. గతంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా చైనా మొదటి వరుసలో నిలబడగా మన భారతదేశం రెండవ స్థానంలో ఉండేది. కానీ చైనాలో కరోనా సృష్టించిన ప్రభంజనం ఎటువంటిదో అందరికీ తెలిసిందే. ప్రాణాంతకమైన కరోనా వైరస్ కి పుట్టినిల్లు అయిన చైనాలో కరోనా వల్ల ప్రతీ రోజు లక్షల మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు.
మొదట చిన్నగా ప్రారంభమైన కరోనా ఆ తరువాత తీవ్ర స్థాయిలో విజృంభించటామే కాకుండా ప్రపంచంలోని అన్ని దేశాలను వణికించింది. ఇప్పటికీ కరోనా కేసులు నమోదవుతున్నాయి. కరోనా వల్ల ప్రపంచ దేశాలలో ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. అయితే అన్నింటికన్నా చైనా దేశంలో ఎక్కువమంది కరోనా వల్ల ప్రాణాలు కోల్పోయారు. ఈ క్రమంలో చైనా జనాభా చాలావరకు తగ్గిపోయింది.
చైనా జనాభా తగ్గటంతో రెండవ స్థానంలో ఉన్న భారతదేశం జనాభా విషయంలో మొదటి స్థానానికి చేరింది. ఈ క్రమంలో భారతదేశంలో జనాభా పెరుగుదల గురించి చైనా అక్కసు వెళ్లగక్కింది. ఈ క్రమంలో భారత దేశంలో జనాభా పెరుగుదల గురించి చైనా విదేశాంగ ప్రతినిధి వాంగ్ వెన్ బిన్ అసంతృప్తి తెలియచేశాడు. ఈ క్రమంలో వాంగ్ వెన్ బిన్ మాట్లాడుతు.. జనాభా పెరగటం ముఖ్యం కాదని, టాలెంట్ ఉండాలని తెలిపాడు.
చైనా జనాభా 140 కోట్లు కాగా అందులో 90 కోట్ల శ్రామిక వర్గం ఉందని తెలిపాడు. వారిలో సగటున 10.5 కోట్ల మంది చదువుకున్న వారు ఉన్నారని వాంగ్ వెన్ బిన్ తెలియచేశాడు. అయితే భారతదేశ జనాభా పెరుగుదల గురించి చైనా విదేశాంగ ప్రతినిధి వాంగ్ వెన్ బిన్ చేసిన వ్యాఖ్యల గురించి కొంతమంది మీమర్స్ మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు. ప్రస్తుతం క్వాలిటీ – క్వాలిటీ అంటూ మీమ్స్ ట్రెండ్ అవుతున్నాయి.