Chiranjeevi: కూతురుపై ప్రేమతో అలా చేసిన చిరంజీవి.. ఎవరూ సాటి రారంటూ?

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి ఇండస్ట్రీలోకి ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా అడుగు పెట్టారు.ఇలా సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చినటువంటి ఈయన తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక మెగా సామ్రాజ్యాన్ని స్థాపించారు. ఈ విధంగా ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి చిరంజీవి ఎందరికో స్ఫూర్తిగా నిలిచారు. అయితే ఈయన చిన్న కుమార్తె శ్రీజ కారణంగా పలు విమర్శలను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది.


చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ సినిమా ఇండస్ట్రీకి చాలా దూరంగా ఉంటారు. అయితే ఈమె తన వ్యక్తిగత కారణాల వల్ల పెద్ద ఎత్తున వార్తల్లో నిలుస్తూ చిరంజీవి పరువు ప్రతిష్టలకు భంగం కలిగేలా చేస్తున్నారు. శ్రీజ చదువుతున్న సమయంలోనే శిరీష్ భరద్వాజ్ అనే వ్యక్తిని వివాహం చేసుకున్నారు.ఆ సమయంలో తన కుటుంబం నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ ఏకంగా కుటుంబంపై ఆరోపణలు చేయడం వల్ల చిరంజీవి ఎంతో బాధపడ్డారట.

 

ఇకశ్రీజ దంపతులు వైవాహిక జీవితంలో చాలా సంతోషంగా ఉన్నారు. ఇక వీరిద్దరికి ఒక కుమార్తె కూడా జన్మించింది అయితే కుమార్తె పుట్టిన తర్వాత తనకు చాలా టార్చర్ మొదలైందని తెలుస్తోంది. ఇలా భర్తతో వచ్చినటువంటి విభేదాలు కారణంగా శ్రీజ విడాకులు తీసుకొని విడిపోవడంతో చిరంజీవి తన కుమార్తె శ్రీజను అలాగే తనకు పుట్టిన బిడ్డను కూడా చేరదీశారు.అనంతరం తన కూతురి క్షేమం కోసం తానే స్వయంగా ఒక కుర్రాడిని చూసి రెండవ వివాహం ఎంతో అంగరంగ వైభవంగా చేశారు.

 

ఇలా రెండవ వివాహంలో సంతోషంగా ఉన్నటువంటి ఈమె మరొక బిడ్డకు జన్మనిచ్చారు అయితే కొంతకాలం క్రితం తన భర్తతో విభేదాలు రావడంతో శ్రీజ తన రెండవ భర్తకు కూడా దూరంగా ఉన్నారు.ఇలా ఇద్దరు పిల్లలు తల్లిగా ఈమె ఒంటరిగా తన జీవితాన్ని గడుపుతున్నారు అయితే తన కుమార్తెకు వచ్చినటువంటి ఈ కష్టం చూసి చలించిపోయినటువంటి చిరంజీవి తన కోసం కొన్ని కోట్ల విలువ చేసే ఆస్తులను కూడా పెడుతున్నారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఈయన హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే కాలనీలో ఏకంగా 35 కోట్ల విలువ చేసే ఇంటిని శ్రీజ పేరు మీద రాయించారని తెలుస్తోంది.ఇలా కూతురు తప్పు చేసిన కూతురిపై ప్రేమను చూపించడంలో ఈయనకు మరెవరు సాటిరారు అంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు.

 

Related Articles

ట్రేండింగ్

Jagan Campaigners For TDP: టీడీపీకి జగన్ రెడ్డి స్టార్ క్యాంపెయినర్.. నమ్మకపోయినా వాస్తవం మాత్రం ఇదే!

Jagan Campaigners For TDP: వైసీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీ స్టార్ క్యాంపెయినర్ గా మారిపోయారు. ప్రజలు నమ్మిన నమ్మకపోయినా ఇదే వాస్తవమని తెలుస్తోంది చంద్రబాబు నాయుడు సూపర్...
- Advertisement -
- Advertisement -