CM Jagan: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం ఎన్నికల ప్రచార కార్యక్రమాలలో భాగంగా మేమంతా సిద్ధం బస్సు యాత్ర ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ బస్సు యాత్రకు భారీ స్పందన వస్తుంది ఎక్కడికి వెళ్లినా ప్రజలు జగన్మోహన్ రెడ్డికి నీరాజనం పలుకుతున్నారు. అయితే ఇదంతా కూడా స్క్రిప్ట్ ప్రకారమే జరుగుతుందని తెలుస్తోంది.
ఐప్యాక్ స్క్రిప్ట్ ను జగన్మోహన్ రెడ్డి ఫాలో అవుతున్నారని అందుకే ఆయన బస్సు యాత్ర అంత విజయవంతం అవుతున్నట్టు ప్రచారం చేసుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి బస్సు ముందు సీట్లో కూర్చుని ప్రయాణిస్తూ ఉంటారు. కొంతమంది బస్సు పక్కనే నిలబడి ఆయన రాగానే మోకాళ్ళపై కూర్చుని దండం పెడుతూ ఉంటారు. మరికొందరు హారతులు పడుతూ కనిపిస్తారు. ఇలా వారందరినీ చూడగానే జగన్ ఒక్క సైగ చేసి బస్సు ఆపుతారు.
ఇక బస్సు ఆపి జగన్మోహన్ రెడ్డి బస్సు మెట్లపై కూర్చుని వారిని తన వద్దకు పిలిపించుకొని మరి వారికి ఏదో ఓదారుస్తున్నట్టు మాట్లాడుతారు ముందుగానే అక్కడ ఆరోగ్య సమస్యలతో బాధపడే వారిని గుర్తించి వారిని బస్సు వద్దకు తీసుకు వస్తారు. ఇక జగన్మోహన్ రెడ్డి స్క్రిప్ట్ ప్రకారమే వారిని పరామర్శించి వెళ్తారు.
ఇక ఈయన బస్సు యాత్రలో భాగంగా జగన్మోహన్ రెడ్డి నటన చూస్తే రాజకీయాలలో కంటే సినిమాలలోకి వస్తే ఇప్పటికే ఎన్నో అవార్డులు కూడా వస్తాయనే చెప్పాలి. అందరిని కౌగిలించుకోవడం ముద్దులు పెట్టడం వంటివి చేయాలి అంటే జగన్మోహన్ రెడ్డి తర్వాత ఎవరైనా అని చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రలో సామాన్యులను కలవడం వెనక ఐపాక్ స్క్రిప్ట్ ఉందని స్పష్టంగా తెలుస్తుంది. అయితే ఐ ప్యాక్ కేవలం మన తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా ఇతర రాష్ట్రాలలో కూడా ఈ విధమైనటువంటి స్క్రిప్ట్ రచించారు అందుకు సంబంధించిన ఫోటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ట్రోల్స్ చేస్తున్న సంగతి మనకు తెలిసిందే.