Conductor Jhansi: వైరల్ అవుతున్న కండక్టర్ ఝాన్సీ సంచలన వ్యాఖ్యలు!

Conductor Jhansi: ప్రముఖ కొరియోగ్రాఫర్ చైతన్య సూసైడ్ చేసుకోవటం తో టాలీవుడ్ లో విషాదఛాయలు అలముకున్నాయి. ఢీ డాన్స్ షోలో కొరియోగ్రాఫర్ గా పనిచేస్తున్న చైతన్య అప్పుల బాధ తట్టుకోలేక నెల్లూరు క్లబ్ లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే.

ఈ విషయం పట్ల డాన్సర్లు తీవ్ర విభ్రాంతికి గురయ్యారు. అందులో భాగంగానే కండక్టర్ ఝాన్సీ కూడా చైతన్య గురించి తన అభిప్రాయాన్ని పంచుకుంది. చైతన్య చాలా మంచివారని, ఆయనకి రావలసిన 6, 7 లక్షల వరకు పేమెంట్లు ఆపేశారు ఈవెంట్ నిర్వాహకులు.

 

అందువల్ల డాన్సర్స్ కి పేమెంట్లు ఇవ్వటం కోసం వేరే వాళ్ళ దగ్గర అప్పులు తీసుకువచ్చారని, అవి తీర్చడం కోసం మరిన్ని అప్పులు చేశారని ఆ అప్పులని తీర్చడంలో విఫలమైన చైతన్య తీవ్ర మనస్థాపనతో ఆత్మహత్యకు పాల్పడ్డారని తెలిపింది ఝాన్సీ. ఆయన తన పరిస్థితిని తన డాన్సర్లకు చెప్పి ఉంటే అర్థం చేసుకునే వారేమో, కళాకారులు మరి అంత కఠిన హృదయం ఉన్నవారు కాదు అంటూ తన ఆవేదన వ్యక్తం చేసింది.

 

ఎందుకింత పని చేసావ్ అన్నయ్య అంటూ బాగా ఎమోషనల్ అయింది. రెండు మూడు రోజుల క్రితమే తను చైతన్య మాస్టర్ ని కలిసానని, ఢీ డాన్స్ షోలో అవకాశం కల్పించమని కోరానని, నెక్స్ట్ సీజన్లో తప్పకుండా అవకాశం ఇస్తానని చెప్పినట్లుగా కండక్టర్ ఝాన్సీ చెప్పుకొచ్చింది.

 

చైతన్య చనిపోయే ముందు తన సూసైడ్ నోట్ లో ఢీ షో తనకి మంచి పేరు తీసుకువచ్చింది కానీ సంపాదన విషయంలో అందుకు పూర్తిగా భిన్నంగా ఉందని చెప్పి వాపోయాడు చైతన్య. తల్లిదండ్రులకి చెల్లెలికి సారీ కూడా చెప్పాడు. అప్పులు చేయడమే కాదు తీర్చేసత్తా కూడా ఉండాలి. సత్తా ఉంది కానీ నావల్ల అవ్వట్లేదు.

ఇదే నా లాస్ట్ డే, అప్పుల బాధని తట్టుకోలేకపోతున్నాను. నావల్ల ఇబ్బంది పడిన వాళ్ళందరికీ నా క్షమాపణలు అని చెప్పి తను తీసిన సెల్ఫీ వీడియో ఇప్పుడు అందరిని కంటతడి పెట్టిస్తుంది.

 

Related Articles

ట్రేండింగ్

Pithapuram: పిఠాపురంలో ఫుల్ సైలెంట్ అయిన ఓటర్లు.. మద్దతు ఏ పార్టీకి అంటే?

Pithapuram:  ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రత్యర్థుల మీద మాటల దాడి చేస్తూ తమ ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు రాజకీయ నాయకులు. ఆ పార్టీ ఈ పార్టీ అనే కాకుండా ప్రతి పార్టీ వారు తమ...
- Advertisement -
- Advertisement -