UK Couple: ఆ జంటకు దొరికిన బంగారు నాణేల విలువ ఎంతో తెలుసా?

UK Couple: ఎవరి జీవతం ఎప్పుడు మలుపు ఎలా తిరుగుతోందో ఎవరికీ అర్థం కాదు. కోటీశ్వరులుగా ఉన్న వారు కొన్ని నెలల వ్యవధిలో బీదలు మారోచ్చు. కటిక పేదరీకంలో గడుపుతున్న వారు ఏకంగా లక్షాది, కోటీశ్వరులు కావొచ్చు. వారి తల రాత ఎప్పుడు మారుతోందో ఏ స్థాయిలోకి చేరుకుంటారో ఆ దేవుడికే తెలుసు. సాధారణ జీవితాన్ని గడుపుతున్న ఓ జంటకు కోట్ల విలువ గల నిధి దొరికిన ఘటన యూకేలో చోటు చేసుకుంది. వారుంటున్న పాత ఇంటికి మరమ్మతులు చేయాలనుకున్న ఓ జంటకు కోట్ల విలువచేసే బంగారు నాణేలు దొరికాయి. వంటగదిని తవ్వుతుండా అందులో ఒక పెద్దసైజ్‌ పెట్టే కంటబడింది. దాన్ని తీసి తెరిచి చూసేసరికి అందులో దాదాపుగా 400 సంవత్సరాల కాలం నాటి 264 బంగారు నాణేలు ఉన్నాయి. వాటి ధర ప్రస్తుతం రూ.2.3 ఉంటుందని అంచనా. అందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి..

యూకేకు చెందిన ఈ జంట అదే ఇంట్లో పదేళ్లుగా నివాసముంటుంది. తాజాగా వారుంటున్న ఇంటిని రినొవేట్‌ చేయాలని భావించి వంట గది ఫ్లోర్‌ బోర్డ్‌ మార్చేందుకు తవ్వుతుండగా ఒక పెద్ద సైజు పెట్టె కనిపించింది. ఏముందో అని తెరిచి చూడగా పాతకాలం నాటి బంగారు నాణేలు కనిపించాయి. ఇవి 18వ శతాబ్దానికి చెందినవిగా గుర్తించిన ఆ జంట ఆ బంగారు నాణేలను వేలంపాటలో అమ్మాలని డిసైడ్‌ అయ్యారు.

ఎల్లర్బీ గ్రామంలో లభ్యమైన ఈ నాణేల్య బిటన్‌ జేమ్స్‌–1, చార్లెస్‌–1 పరిపాలించిన సమయం వాడుకలో ఉన్నట్లు పరిశోధనకులు భావిస్తున్నారు. ఈ నాణేలన్నీ 1610–1727 మధ్య కాలం నాటివని గుర్తించారు. అప్పటి కాలానికి చెందిన ఓ ప్రముఖ వ్యాపారవేత్తల కుటుంబం ఈ సొమ్మును దాచుకొని ఉంటుందని పరిశోధకుల అభిప్రాయపడ్డారు. ఈ జంటకు దొరికిన పాతకాలపు బంగారు నాణేలను వారు 2.5 లక్షల పౌండ్లు అనగా దాదాపుగా రూ.2.3 కోట్లకు అమ్మలనుకున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -