దారుణం: టీలో విషం కలిపి పిల్లలను చంపేసిన కసాయి తల్లి!

Crime news: మనుషులైనా, జంతువులైనా పక్షులైన కన్నతల్లి ప్రేమను మించిందే లేదు. దేవుడు అన్ని చోట్ల ఉండలేక దేవునితో సమానమైన తల్లిని పంపిస్తాడు అన్ని పెద్దలు చెబుతుంటారు. తన బిడ్డలకు ఏ చిన్నా హానీ కలిగిన విలవిలలాడుతోంది తల్లి.. తాను ఓ పూట ఉపాసం ఉండి తన పిల్లకు మూడు పూటల భోజనం పెడుతోంది తల్లి. అదీ కన్న తల్లి ప్రేమంటే..

కోడి పిల్లలను ఎత్తుకెళ్లేందుకు గద్ద వచ్చినప్పుడు గద్దంతా బలం లేకపోయినా తన పిల్లలను కాపాడే ప్రయత్నంలో కోడి ఆ గద్దతో పోరాడుతోంది. జంతువులు, పక్షలకు ఉండే పిల్లలపై ఉండే ప్రేమ నేటి సమాజంలో కొందరు తల్లులకు లేకుండా పోతోంది. తన సొంత పిల్లలకు టీలో విషం కలిపి కన్న పేగును కాటేసుకుంది ఓ కసాయి తల్లి.ఉత్తరప్రదేశ్‌లోని ఘాజీపూర్‌కు చెందిన సునీతా యాదవ్‌తో భర్తతో పాటు, అత్తమామల వేధింపులు జరుగుతున్నాయి. ప్రతి రోజూ ఏదో ఓ వంకతో గొడవ జరిగి సునీతాయాదవ్‌ను ఆడిపోస్తుండా దానికి భర్త వత్తాసు పలకడంతో సునీతా విసుగెత్తిపోయింది. ఈ క్రమంలో మనస్తాపం చెందిన సునీతా తన నలుగురు పిల్లలను తీసుకుని పుట్టింటైన దంధానికి వెళ్లిపోయింది.

వెళ్లిన మరోసటి రోజే భర్త ఆమెకు ఫోన్‌చేసి గొడవ పడ్డాడు. దీంతో చిరెత్తిపోయిన సునీతా తన పిల్లల్లోని ముగ్గురు హిమాన్షు యాదవ్‌(10) పీయూష్‌ యాదవ్‌ (8)సుప్రియా (5) టీలో విషం కలిపి ఇచ్చింది. ఆ టీ తాగిన ముగ్గురు ఒకేసారి అస్వస్థకు గురవ్వడంతో ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ముగ్గురు మృతిచెందారు. ఆ సమయంలో నాలుగో కుమారుడు ఇతర పిల్లలతో ఆడుకునేందుకు బయటకు వెళ్లడంతో ఆ పిల్లాడు ప్రాణాలతో దక్కినట్లు ఆ జిల్లా ఎస్పీ రోహన్‌ ప్రసాద్‌ తెలిపారు. భార్య భర్తల గొడవలు పిల్లలపై చూపరాదని కూర్చొని మాట్లాడుకుంటే సమస్యలన్నీ సర్దుకుపోతాయని సైకాలజిస్టులు సూచిస్తున్నారు. తల్లి క్షణికావేశం ముగ్గురు చిన్నారులను బలితీసుకోవడంతో ఆ తల్లిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -