Crime: ఏంటో ఈ మధ్యకాలంలో భార్యాభర్తల మధ్య గొడవలు చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. ఎందుకంటే ఆ గొడవలు అలా ఉంటాయి కాబట్టి. ప్రతి చిన్నదానిని పెద్దగా చేసి విడాకుల వరకు, చంపడాల వరకు పోతున్నాయి. ఇప్పుడు అటువంటి ఘటననే ఓ దగ్గర చోటు చేసుకుంది. ఇంతకు అసలు విషయం ఏంటో తెలుసుకుందాం..
సుందర్ గడ్ జిల్లాలో ఓ ప్రాంతంలో హేమంత్ బాఘ్, సరిత అనే దంపతులు నివసిస్తున్నారు. ఇక వీరికి ఇద్దరు కూతుర్లు. హేమంత్ ట్రక్ డ్రైవర్ గా పని చేస్తూ ఉండేవాడు. ఇక చిన్నపాటి కుటుంబంతో సర్దుకుపోదాం అన్నట్లుగా ఈ కుటుంబం జీవిస్తుంది. ఇక ఇప్పటివరకు ఈ భార్యాభర్తల మధ్య ఎటువంటి గొడవలు రాకుండా మంచిగా సాగకుండా వచ్చింది.
అయితే ఇటీవలే ఓ రోజు రాత్రి అన్నం తినేందుకు అందరు కూర్చోగా.. ఆ సమయంలో అన్నంలో చీమలు ఉండటంతో భర్త కాస్త కోపంతో ఏంటి తిని అన్నం లో చీమలు వచ్చాయి అంటూ కసురుకున్నాడు. ఇక ఆమె నిర్లక్ష్యంగా సమాధానం చెప్పటంతో ఇద్దరి మధ్య మాటలు యుద్ధం జరిగి గొడవ చాలా పెద్దగా అయింది.
దీంతో సరిత తన కోపాన్ని ఆపుకోలేక వెంటనే తన భర్త గొంతు నులిమి చంపేసింది. అతడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోవడంతో హేమంత్ తండ్రి ఘటనను తట్టుకోలేక వెంటనే పోలీసులకు చెప్పటంతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఆమెను అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నట్లు తెలిసింది. ఇక ప్రస్తుతం ఈ వార్త అంతట వ్యాప్తించగా వామ్మో ఇంత చిన్న దానికి ఏకంగా ప్రాణాలే తీయాలా అంటూ ఆమెపై బాగా ఫైర్ అవుతున్నారు.