Devineni: లోకేశ్ ఓడిపోతాడంటూ దేవినేని సంచలన వ్యాఖ్యలు.. ఏమైందంటే?

Devineni: రాజధాని ప్రాంతంలో సుమారు 51,000 మంది నిరుపేద ప్రజలకు ఇల్లు పట్టా పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టిన విషయం మనకు తెలిసిందే.ఇలా ఇల్లు పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతంగా చేస్తున్న నేపథ్యంలో ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి వైసీపీ నాయకుడు దేవినేని అవినాష్ మీడియాతో మాట్లాడుతూ లోకేష్ పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.రాజధాని ప్రాంతంలో పేదలకు ఇంటి స్థలాలు ఇచ్చినప్పటికీ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రాగానే వాటిని రద్దు చేస్తారని వార్తలు వస్తున్నాయి.

ప్రజలు కూడా ఈ సందేహాలను వ్యక్తం చేయడంతో ఈ వ్యాఖ్యలపై దేవినేని అవినాష్ స్పందిస్తూ తలకిందులు తపస్సు చేసిన టిడిపి ప్రభుత్వం అధికారంలోకి రాదని ఈయన తెలియజేశారు.టిడిపి అధికారంలోకి రాదని అయితే జగన్ గెలుపును అడ్డుకోలేక ఇలా తెలుగుదేశం నేతలు ఆ వాక్కులు చవాక్కులు పేలుతున్నారని దేవినేని వెల్లడించారు.ఇక లోకేష్ ను ఓడించడానికి వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఇల్లు పట్టాలు పంపిణీ చేస్తున్న వార్తలపై కూడా ఆయన స్పందించారు.

 

మంగళగిరిలో లోకేష్ ను ఓడించాలి అంటే పేద ప్రజలకు ఇల్లు పట్టాలు పంపిణీ చేయాల్సిన పనిలేదని కేవలం లోకేష్ సైగలు, మాటలే ఆయనని ఓడిపోయేలా చేస్తాయి అంటూ అవినాష్ తెలిపారు. జగన్ ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలే తమ పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకువస్తాయని అవినాష్ తెలిపారు.ఇక జగన్మోహన్ రెడ్డి పెడుతున్న భారీ బహిరంగ సభలకు ప్రజలను రాకుండా అడ్డుకోవడం తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ తరపు కాదని ఈయన తెలిపారు.

 

ఇక మంగళగిరిలో ఓడిపోయిన లోకేష్ మంగళగిరిలో గెలిచి జగన్మోహన్ రెడ్డికి రిటర్న్ గిఫ్ట్ ఇస్తానంటూ గతంలో శపదాలు చేసిన విషయం మనకు తెలిసిందే. అయితే ప్రస్తుతం మంగళగిరిలో లోకేష్ గెలిచే సూచనలు ఏమాత్రం కనిపించకపోవడంతో తెలుగుదేశం నేతలు సైతం ఈ విషయంలో మౌనం వహిస్తున్నారని చంద్ర

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -