Lakshmi Parvathi: లక్ష్మీ పార్వతి ఎన్టీఆర్ కంటే ముందే ఆ హీరోని టార్గెట్ చేసిందా?

Lakshmi Parvathi: తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటుడిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న స్వర్గీయ నందమూరి తారక రామారావు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.నటుడుగా ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారో, రాజకీయ నాయకుడిగా కూడా ప్రజల మనసులో చేరగని ముద్ర సాధించుకున్నారు. ఈ విధంగా ఎన్టీఆర్ సినీ రాజకీయ జీవితంలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. అయితే తన వ్యక్తిగత జీవితంలో మాత్రం చివరికి తన కుటుంబ సభ్యులు తనని దూరం పెట్టిన పరిస్థితి ఏర్పడింది.

ఎన్టీఆర్ స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న సమయంలోనే ఈయన హీరోయిన్ కృష్ణకుమారిని రెండో పెళ్లి చేసుకోవాలని భావించారట కృష్ణ కుమారిని పెళ్లి చేసుకుంటే తన అన్న వదినల జీవితం నాశనం అవుతుందని భావించిన ఎన్టీఆర్ తమ్ముడు త్రివిక్రమ్ రావు కృష్ణకుమారికి సీరియస్ వార్నింగ్ ఇచ్చి పంపించారట.ఈ విధంగా ఎన్టీఆర్ కృష్ణ కుమారిని పెళ్లి చేసుకోవడం ఆపగలిగారు కానీ ఆయన లక్ష్మీపార్వతిని వివాహం చేసుకోవడం మాత్రం ఆపలేకపోయారు.

 

పార్వతి 1994 ఎన్నికల ముందు ఎన్టీఆర్ కి మాయ మాటలు చెప్పి తనని తన వలలో వేసుకొని పెళ్లి చేసుకున్నారంటూ తాజాగా జర్నలిస్ట్ ఈమంది రామారావు తెలియచేశారు.అయితే ఈమె ఎన్టీఆర్ కంటే ముందుగా మరొక స్టార్ హీరోని పెళ్లి చేసుకోవాలని భావించి తనని టార్గెట్ చేశారని ఈయన తాజాగా ఒక ఇంటర్వ్యూలో తెలియజేశారు. ఇండస్ట్రీకి ఎన్టీఆర్ ఏఎన్నార్ రెండు కళ్ళు లాంటివారని చెబుతుంటారు.అయితే ఈమె ముందుగా ఏఎన్ఆర్ వద్దకు వెళ్లి తన జీవితం గురించి పుస్తకం రాస్తానని చెప్పి తనకు మాయ మాటలు చెప్పారట.

 

లక్ష్మీపార్వతి మాటలను పసిగట్టిన ఏఎన్ఆర్ తనతో సున్నితంగా మాట్లాడుతూ ప్రస్తుతం నా జీవిత కథ రాయాల్సిన అవసరం ఏమాత్రం లేదు ఒకవేళ రాయించుకోవాల్సి వస్తే అప్పుడు తప్పకుండా మిమ్మల్ని పిలుస్తానని ఏఎన్ఆర్ చెప్పి పార్వతిని అక్కడి నుంచి పంపించారట. ఇలా ఏఎన్ఆర్ ను టార్గెట్ చేసిన ఈమె చివరికి ఎన్టీఆర్ ను తన మాటలతో తన వలలో పడేసుకుని పెళ్లి చేసుకున్నారు.అయితే ఈ విషయాన్ని తాను ధైర్యంగా లక్ష్మీపార్వతి ముందు కూడా చెబుతానని ఈ సందర్భంగా ఈయన లక్ష్మీపార్వతి గురించి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: చిరు జీవులకు సైతం అన్యాయం చేసిన జగన్ సర్కార్.. మరీ ఇంతలా మోసమా?

CM Jagan: జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున రాష్ట్రంలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున దోపిడీలు చేస్తున్నారు వైకాపా నేతలు కొండలను గుట్టలను చెరువులను వదలలేదు పెద్ద...
- Advertisement -
- Advertisement -