Dil Raju: సాధారణంగా ఒక సినిమా చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలంటే దర్శక నిర్మాతలకు ఇతర టెక్నీషియన్లు రాత్రి పగలు కష్టపడుతూ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తుంటారు. అయితే ఇలాంటి సినిమా విషయంలో తరచూ లీకులు కావడం చిత్ర బృందాన్ని ఎంతో ఆందోళనకు గురి చేస్తూ ఉంటుంది. ఇలా సినిమా లొకేషన్ లో నుంచి లీక్ అయ్యే విషయం పై ఇప్పటికే నిర్మాతలు ఎంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ కఠిన చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఇలా సినిమా షూటింగుల నుంచి లీకుల బెడద మాత్రం ఆగడం లేదు.
ఇకపోతే రామ్ చరణ్ శంకర్ కాంబినేషన్ లో రాబోతున్న పాన్ ఇండియా సినిమా నుంచి ఇలాంటి లీకులు ఇప్పటికే ఎన్నో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.ఈ సినిమాలో రామ్ చరణ్ గెటప్ కి సంబంధించిన ఎన్నో ఫోటోలు సోషల్ మీడియాలో ఇప్పటికే లీక్ కావడంతో మెగా అభిమానులు ఆందోళన వ్యక్తం చేశారు.ఇలా సినిమాకు సంబంధించిన అన్ని విషయాలు లీక్ అయితే సినిమాలో ఎలాంటి థ్రిల్ ఉండదంటూ అభిమానులు ఆందోళన వ్యక్తం చేశారు.
ఇకపోతే గత సోమవారం నుంచి రాజమండ్రిలో ఈ సినిమా కొత్త షెడ్యూల్ చిత్రీకరణ జరుపుకుంటుంది. ఈ క్రమంలోనే రామ్ చరణ్ నటి అంజలి పాత్రలకు సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మెగా అభిమానులు మాత్రం ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు.ఇలా సినిమాకు సంబంధించిన అన్ని విషయాలు లీక్ అవుతుంటే నిర్మాతలు ఏం చేస్తున్నారు? ఇలా లీకులను కట్టడి చేయడంలో నిర్మాత ఫెయిల్ అయ్యారా అంటూ పెద్ద ఎత్తున మండిపడ్డారు.
ఈ క్రమంలోనే ఈ సినిమా నుంచి రాంచరణ్ అంజలికి సంబంధించిన కొన్ని ఫోటోలు విడుదల కావడంతో ఈ విషయంపై శంకర్ రామ్ చరణ్ నిర్మాత దిల్ రాజు పూర్తిస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారని ఇలాంటి చర్యలకు పాల్పడిన వారిపై కఠినంగా చర్యలు తీసుకోవాలని భావించినట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమా నుంచి ఫోటోలు లీక్ కావడానికి చిత్ర బృందానికి సంబంధించిన ఓ వ్యక్తి కారణమని తెలుస్తోంది. ఈ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నటువంటి ఓ వ్యక్తి ఫోటోలు లీక్ చేయడంతో వెంటనే ఆయనపై చర్యలు తీసుకొని సినిమా నుంచి తొలగించినట్టు తెలుస్తోంది.