Eluru: ఇటీవల కాలంలో చాలామంది దుర్మార్గులు అమ్మాయిలను ప్రేమించమంటూ వెంట పడటం కాదు నేతరిగి వేధించడం చివరికి చంపడం లాంటివి కూడా చేస్తున్నారు. అంగీకరించిన తర్వాత సరిగా చూసుకుంటున్నారా అంటే అది కూడా లేదు చిత్రహింసలు పెట్టి వారిని చంపడానికి కూడా వెనకనడం లేదు. ఈమధ్య కాలంలో ఇలాంటి ఘటనలు ఎక్కడ చూసినా కూడా వెలుగులోకి వస్తున్నాయి. ఆ విషయాలు ఇంట్లో తల్లిదండ్రులకు చెబితే చదువుకోనివ్వరేమో అన్న భయంతో ఆడపిల్లలు వాటన్నింటినీ మౌనంగా భరిస్తుండగా చివరికి వారి ప్రాణాలే పోతున్నాయి.
తాజాగా ఒక యువకుడు ప్రేమించమంటూ యువతి వెంట పడడంతో పాటు ఉన్మాదిగా మారాడు. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఈ దారుణమైన ఘటన ఏపీలో ఏలూరు జిల్లాలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. పెదవేగి మండలం దుగ్గిరాలలో ఉంటున్న ఇంజనీరింగ్ విద్యార్థిని అనుదీప్ అనే యువకుడు ప్రేమించాలంటూ వెంటపడేవాడు. తన ప్రేమను అంగీకరించాలని యువతిని టార్చర్ పెట్టాడు. అతని ప్రేమకు ఆ అంగీకరించలేదని ఆమెను ఒక గదిలో బంధించి, ఒంటిపై వేడి నూనె పోసి చిత్రహింసలకు గురిచేశాడు.
ఈ దాడిలో యువతి చేతికి, కాలికి గాయాలు అయ్యాయి. అనుదీప్ నుంచి తప్పించుకున్న యువతి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చింది. ప్రస్తుతం బాధితురాలు ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు వెల్లడించారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.