Rajamouli: రాజమౌళి వల్లే ఈ హీరోలకు కెరీర్ ఉందా.. కఠినమైన వాస్తవాలు ఇవే!

Rajamouli: తెలుగు సినీ ప్రేక్షకులకు టాలీవుడ్ దర్శకుడు ఎస్.ఎస్ రాజమౌళి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో అపజయం ఎరుగని దర్శకుడిగా రాజమౌళి దూసుకుపోతున్నారు. ఇప్పటివరకు రాజమౌళి తెరకెక్కించిన సినిమాలు అన్నీ కూడా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టించడంతో పాటు బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలిచిన విషయం తెలిసిందే. ఇది ఇలా ఉంటే రాజమౌళి గత ఏడాది ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే. టాలీవుడ్ పాటు బాలీవుడ్ లో కూడా చాలామంది హీరోలు రాజమౌళి దర్శకత్వంలో ఒక్కసారైనా నటించాలి అన్న చాలా మంది హీరోలు అనుకుంటూ ఉంటారు.

అందుకు హీరోలు ఎప్పుడు అడిగినా కూడా ఓకే చెబుతూ ఉంటారు. అయితే ఇదే ఇప్పుడు కొంత మంది హీరోల పాలిట శాపంగా మారేలా కనిపిస్తుంది. చాల ఏళ్ళు ఒక్కో సినిమాకు టైం తీసుకునే రాజమౌళి హీరోల ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటాడు. అయితే ఒక్కోసారి రాజమౌళితో సినిమా చేయాలనీ ఫిక్స్ అయితే ఎన్ని ఏళ్ళు అయినా సరే అతడి కోసం వదిలి పెట్టాల్సిందే. జక్కన్న లాగ చిత్రాన్ని చెక్కి చెక్కి ఎలాంటి తప్పులు లేకుండా విడుదల చేస్తాడు. అయితే రాజమౌళి సినిమాలో భారీగా ఫ్యాన్ ఇండియా సినిమా అయ్యింది బాహుబలి. ఈ సినిమా తర్వాత ఒక లెక్క సినిమాకు ముందు ఒక లెక్క అన్నట్టుగా ఉంది.

 

అయితే రాజమౌళితో సినిమా తీసిన తర్వాత ఆ హీరోలు కానీ నటులు కానీ ఏమాత్రం అంచనాలు తక్కువగా సినిమాలు చేస్తే జనాలు చూడలేని పరిస్థితి. అందుకు పర్ఫెక్ట్ ఉదాహరణ ప్రభాస్. బాహుబలి రెండు భాగాల కోసం దాదాపు ఐదేళ్ల పాటు టైం ఇచ్చి కష్టపడ్డాడు. కానీ ఆ సినిమా ప్రభావం కారణముగా అంత కంటే గొప్ప సినిమాలు రావాలని జనాలు కోరుకుంటున్నారు. దాంతో ప్రభాస్ నటించిన సాహూ, రాధే శ్యామ్, ఆదిపురుష్ సినిమాల ఫలితాలు మారిపోయాయి. ఇక రామ్ చరణ్ పరిస్థితి ఇంచుమించు ఇలాగే ఉంది. ఆర్ఆర్ఆర్ తర్వాత ఆచార్య చిత్రంలో నటిస్తే అది పరాజయం పాలయ్యింది. కిసి కా భాయ్ కిసి కి జాన్ సినిమా పరిస్థితి కూడా అంతే. ఇక ముందు ముందు రానున్న సినిమాల గురించి వేచి చూస్తే తెలుస్తుంది. మరి దేవర తో రాబోతున్న జూనియర్ ఎన్టీఆర్ పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు కానీ రాజమౌళి మాత్రమే ఒక కథను అన్ని రకాలుగా అలోచించి ఎలాంటి తప్పులకు తావు లేకుండా తీసి అద్భుతమైన ప్రమోషన్స్ తో సినిమా విజయవంతం చేసుకోగలడు అని మరోమారు ఆదిపురుష్ రిజల్ట్ తో ప్రూవ్ అయ్యింది.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -