Kumari Aunty: కుమారి ఆంటీ సోషల్ మీడియాలో సెలబ్రిటీ రేంజ్ లో పాపులారిటీ సొంతం చేసుకున్నారు. ఈమె ఫుడ్ స్టాల్ బిజినెస్ జరుపుకుంటూ తన జీవనం గడిపేవారు.. ఇలా హైదరాబాదులో కేబుల్ బ్రిడ్జి వద్ద ఫుడ్ పాత్ పక్కన ఫుడ్ బిజినెస్ జరుపుకుంటూ ఉన్నటువంటి ఈమె చాలా పాపులారిటీ సొంతం చేసుకున్నారు. ఈమె వద్దకు ఎంతో మంది యూట్యూబ్ ఛానల్ వాళ్ళు వెళ్లి ఆమెను ఇంటర్వ్యూ చేయడంతో ఈమె పూర్తిగా వార్తలలో నిలిచి పాపులారిటీని సొంతం చేసుకున్నారు.
ఇకపోతే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈమె తన గురించి చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. తాను 2009వ సంవత్సరంలో హైదరాబాద్ వచ్చానని తెలిపారు. హైదరాబాద్ వచ్చిన మొదట్లో ఈమె గుడ్డలు కుట్టుకుంటూ జీవనం గడిపేదాన్ని అదేవిధంగా సింగర్ హేమచంద్ర ఇంట్లో వంట మనిషిగా కూడా తాను పనిచేశానని తెలిపారు.
సింగర్ హేమచంద్ర తల్లిదండ్రులు చాలా మంచివారు నన్ను సొంత బిడ్డలాగే చూసుకునేవారు. ఇక నన్ను ఎప్పుడూ కూడా హేమచంద్ర అమ్మ తిడుతూనే ఉండేది ఇంత అమాయకంగా ఉంటే బయట ఎలా బతుకుతావు అంటూ ఎప్పుడు నన్ను అనేవాళ్ళు అయితే ఆమె నాకు చేసిన ఆర్థిక సహాయం వల్లే నేను ఈ ఫుడ్ బిజినెస్ పెట్టానని కుమారి ఆంటీ తెలిపారు.
హేమచంద్ర తల్లి నాకు 30 వేల రూపాయలను ఇచ్చారు ఆ 30 వేల రూపాయలతో నేను మెల్లిగా ఈ ఫుడ్ బిజినెస్ ప్రారంభించానని కుమారి ఆంటీ తెలిపారు. అలా మొదలైనటువంటి ఈ వ్యాపారం నేడు ఈ స్థాయికి చేరుకుందని దానంతటకీ కారణం హేమచంద్ర తల్లితండ్రుల అంటూ ఈ సందర్భంగా కుమారి ఆంటీ చేసినటువంటి ఈ కామెంట్లు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.