Success Story: కూలి పనులు చేసి బంగారు పతకాలు అందుకున్న రోజమ్మ.. ఈమె సక్సెస్ స్టోరీ మీకు తెలుసా?

Success Story: ఈ రోజుల్లో అన్ని సక్రమంగా ఉన్నా కూడా చాలామంది విద్యార్థులు చదువుకోవడానికి ఆసక్తిని చూపించడం లేదు. కానీ కొందరు విద్యార్థులు ఇంట్లో పూట గడవని పరిస్థితులలో కూడా కష్టపడి వీధిలైట్లు నిలబడి మరి చదువుకొని ఉన్నత శిఖరాలకు చేరుకుంటున్నారు. అలా మట్టిలో మాణిక్యాలు ఇప్పటికే ఎంతోమంది వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా కూడా ఒక అమ్మాయి కూలి పనులు చేసి మరి బంగారు పతకాలు అందుకుంది. ఇంతకీ ఆమె ఎవరు? ఆమె సక్సెస్ ఏమిటి అన్న వివరాల్లోకి వెళితే..

ప్రకాశం జిల్లా పామూరు మండలం గమ్మలం పాడుకు చెందిన గంధం రోజమ్మ సక్సెస్ స్టోరీ వింటే ఆమె ధైర్యానికి సాహసానికి మెచ్చుకోవాల్సిందే. రోజమ్మ తల్లి సుశీల, తండ్రి ఇసాక్ ఇద్దరూకూలి పనులు చేసేవారు. రోజమ్మ ఇంటర్ లో చేరాక కుటుంబానికి ఆర్థిక ఇబ్బందులు పెరిగాయి. అదే సమయంలో రోజమ్మ తల్లి కూడా అనారోగ్యం పాలయ్యారు. ఆ సమయంలో రోజమ్మ కాలేజ్ కు కూడా సరిగ్గా వెళ్లేవారు కాదు. ఇంట్లో ఆర్థిక కష్టాలు తీరడానికి రోజమ్మ కూలి పనికి వెళ్లేది. ఆదివారం పూట పిల్లలకు ట్యూషన్లు కూడా చెప్పేవారు. ఆస్పత్రిలో నగల దుకాణంలో హెల్పర్ గా పని చేయడంతో ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో మూడు సబ్జెక్ట్ లు ఫెయిల్ అయ్యారు.

 

ఆ తర్వాత రోజమ్మ మూడేళ్లు కూలి పనులకు పరిమితమయ్యారు. ఆ తర్వాత తెలుగు శాఖ అధ్యక్షులు శ్రీపురం యజ్ఞశేఖర్ రోజమ్మ ఇంటర్ పూర్తి చేసేలా సహాయ సహకారాలు అందించారు.
ఆ తర్వాత రోజమ్మ చెన్నైలోని క్యూన్ మేరీస్ కాలేజ్ లో బీఏ తెలుగులో చేరారు. అయితే ఆ సమయంలో కూడా రోజమ్మ సేల్స్ గర్ల్ గా సాయంత్రం పని చేస్తూ ఉదయం కాలేజ్ కు వెల్లి చదువుకున్నారు. అలా బీఏ తెలుగులో బంగారు పతకం సాధించిన రోజమ్మ సీఎం స్టాలిన్ చేతుల మీదుగా ఆ పతకాన్ని అందుకుంది. తాజాగా ఎం.ఏ తెలుగులో 80 శాతం మార్కులతో బంగారు పతకాన్ని సాధించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఆ పతకాన్ని అందుకుంది. తన సక్సెస్ గురించి రోజమ్మ మాట్లాడుతూ.. ఎన్నో కష్టాలను అధిగమిస్తే ఈ పతకాలు దక్కాయని ఆమె తెలిపింది. నాలా చదువుకునే ఆడపిల్లలకు స్పూర్తిగా నిలవాలని అనుకుంటున్నానని రోజమ్మ కతెలిపింది. పీహెచ్డీ చేసి ప్రొఫెసర్ కావాలని నేను అనుకుంటునన్నానని ఆమె చెప్పుకొచ్చింది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -