Poonam Kaur: పూనమ్ కౌర్ ను వేధిస్తున్న అరుదైన వ్యాధి ఏంటో తెలుసా?

Poonam Kaur: ఎస్ శ్రీ కృష్ణారెడ్డి డైరెక్షన్లో మాయాజాలం సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైన పూనం గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. ఆమె తన నటనతోనూ,అందంతోనూ టాలీవుడ్ ప్రేక్షకులని కట్టిపడేసింది. మాయాజాలం సినిమా తరువాత ఆమె ఒక విచిత్రం, నిక్కీ అండ్ నీరజ్, శ్రీనివాస కళ్యాణం, నెక్స్ట్ ఏంటి వంటి సినిమాలలో నటించింది. సినిమాల నుంచి మెల్ల మెల్లగా కనుమరుగవుతున్నప్పటికీ సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు తన అభిమానులకి అందుబాటులో ఉంటుంది.

 

అయితే ఇప్పుడు ఈమె గురించిన సమాచారం ఎందుకంటారా.. సమంత లాగా ఈమె కూడా ఒక అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్లు సమాచారం. ఏ వ్యాధి పేరు ఫైబ్రో మాయాల్జియా. పూనం ప్రస్తుతం కేరళలోని ఆయుర్వేద చికిత్స తీసుకుంటుందట. ఈ వ్యాధి కారణంగా అలసట, నిద్ర, జ్ఞాపక శక్తి తగ్గిపోవడం, మానసిక స్థితిలో సమస్యలు, కండరాలు నొప్పి సహా పలు ఇబ్బందులు పడుతుందట. గత రెండు సంవత్సరాల నుంచి పూనం ఈ వ్యాధితో బాధపడుతున్నట్లు సమాచారం.

నిజానికి ఈమెకు 2022 సమయంలో వెన్నునొప్పి సమస్యలతో బాధపడుతూ చికిత్స కోసం కేరళ కి వెళ్లారు. అక్కడ ట్రీట్మెంట్ తీసుకునే క్రమంలో ఈ వ్యాధి నిర్ధారణ అయింది ఈ విషయాన్ని ఆమె కూడా గతంలో బయటపెట్టింది. తాజాగా తన పరిస్థితి గురించి తన ఎక్స్ పేజీలో లో ఒక పోస్ట్ చేసింది. నేచురోపతి వైద్యంలో ఎంతో గుర్తింపు పొందిన డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజును ఆమె ఆమె కలుసుకున్నట్లు తెలిపింది.

 

ఆయనను కలవడం ఎంతో ఆనందాన్ని కలిగించినట్లు ఆమె చెప్పుకొచ్చింది. ఫైబ్రో మాయాల్జియా వైద్యానికి సంబంధించి ఆయన ఇచ్చిన సూచనలు ఎంతో అమూల్యం. మంచి మనసు కలిగి వ్యక్తితో ఒక కార్యక్రమంలో పాల్గొని వ్యాధి గురించి చర్చించే అవకాశం కలగడం తన అదృష్టమని పేర్కొంది. అయితే ఈ వ్యాధికి మందులు లేవని జీవనశైలిలో ఆ మార్పులతోనే దీనిని కంట్రోల్ చేయవచ్చు అని వైద్యులు చెబుతున్నారు.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: చిరు జీవులకు సైతం అన్యాయం చేసిన జగన్ సర్కార్.. మరీ ఇంతలా మోసమా?

CM Jagan: జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున రాష్ట్రంలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున దోపిడీలు చేస్తున్నారు వైకాపా నేతలు కొండలను గుట్టలను చెరువులను వదలలేదు పెద్ద...
- Advertisement -
- Advertisement -