Black Dog: హిందూ సాంప్రదాయంలో పూజలు, శాస్త్రలు చాలా ఉంటాయి. వాస్తు దోషం, కుజ దోశం తదితరులను చాలా మంది నమ్ముతారు. మంచి పనులు చేసేందుకు కొన్ని ప్రత్యేకమైన రోజులనే ఎంచుకుంటారు. ఇళ్లలో ఎలాంటి కీడు శంకించినా.. అనుకున్న పనులు కాకున్నా..దోశ నివారణకు పూజలు, హోమలు చేస్తుంటారు. పితృ, శని దోషం పోవాలంటే శనివారం పాలలో బెల్లం కలిపి రావి చెట్టుకు పెడుతూ ‘శం శనిశారాయ నమః’ అనే మంత్రాన్ని 27 సార్లు జపించాలి.
హిందూ మతంలో అరటి చెట్టుకు చాలా ప్రాముఖ్యత ఉంది. రావిచెట్టు లో అనేక దేవతలు కొలువై ఉంటారని నమ్ముతారు. పుష్పవృక్షం మూలంలో బ్రహ్మ, కొమ్మలో విష్ణువు, పైభాగంలో శివుడు.రావి చెట్టును పూజించడం వల్ల అనేక రకాల దోషాలు తొలగిపోతాయని చెబుతారు. శనిదోషం పోవాలంటే రావిచెట్టును పూజించాలి.పితృదోషం తొలగిపోవాలంటే రోజూ ఉదయం పూట రావిచెట్టుకు నీళ్లు పట్టించాలి. దీని తరువాత, నల్ల కుక్కకు రొట్టె తినిపించండి.
ఇలా చేయడం వల్ల పితృదోషం నుంచి రక్షించినట్లవుతుంది. అలాగే శని దోషం తొలగుతుంది. మంగళవారం నాడు శనిదోష నివారణకు రావిచెట్టులోని పదకొండు ఆకులను తీసుకుని గంగాజలంతో శుద్ధి చేసి, ఆకులపై కుంకుమతో శ్రీరామ అని రాసి మాల వేయాలి. దీని తరువాత, హనుమాన్ ఆలయానికి వెళ్లి ఆకులతో చేసిన మాల సమర్పించాలి. ఇలా చేస్తే దోశాలన్నీ తొలగిపోతాయిని గాఢంగా నమ్ముతారు.