Balayya: ఆ హీరోయిన్లంటే అంత ఇష్టమా? మనసులోని మాట బయటపెట్టిన బాలయ్య

Balayya: తెలుగు చలన చిత్ర పరిశ్రమలో నందమూరి బాలయ్యకు ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. సినిమా ఇండస్ట్రీలో డేర్ గల హీరోల్లో ఈయన ముందుంటారు. నచ్చితే శభాష్ అనడం బాలయ్య నైజం. తప్పు చేస్తే తాట తీయడం కూడా బాలయ్య చేస్తాడు. అందుకే నందమూరి బాలయ్యతో సినిమా చేయాలన్నా, ఆయనతో మాట్లాడాలన్నా కూడా చాలా డేర్ ఉండాలని సినీ ప్రముఖులు అంటూ ఉంటారు.

 

తాజాగా నందమూరి బాలయ్య హీరోగా నటించిన ” వీరసింహారెడ్డి “ అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో బాలకృష్ణ డ్యూయల్ రోల్ లో నటించనున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే తెలిపింది. కాగా ఈ సినిమాలో అందాల ముద్దుగుమ్మ శృతిహాసన్ మొదటి హీరోయిన్ గా నటిస్తోంది. ఇక రెండో హీరోయిన్ గా మలయాళీ ముద్దుగుమ్మ హనీ రోజ్ కనిపించనుంది. ఈ సినిమా మరో 48 గంటల్లో థియేటర్లలో విడుదల కానుంది.

 

ఈ నేపథ్యంలోనే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా అన్ స్టాపబుల్ షో కి స్పెషల్ గెస్ట్ గా వీర సింహారెడ్డి టీమ్ విచ్చేసింది. దానికి సంబంధించిన అఫీషియల్ ప్రకటనను ఆహా ఓటీటీ సంస్థ విడుదల చేసింది. వీరసింహారెడ్డి సినిమా టీమ్ అన్ స్టాపబుల్ షోకు వచ్చిన కొన్ని ఫోటోలను ఆహా తన అఫీషియల్ ఖాతాలో పోస్టు చేసింది. ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ వార్త వైరల్ అవుతోంది.

 

షోలో గోపీచంద్ మలినేని బాలయ్యను ఓ ప్రశ్న అడిగారు. ఈ సినిమాల్లో తనతో నటించిన హీరోయిన్స్ శృతిహాసన్, హనీ రోజ్ లో ఎవరంటే మీకు బాగా ఇష్టం అని అడిగితే తనకకు శృతిహాసన్ తో క్లాస్, హనీతో మాస్ అని బాలయ్య బదులిచ్చాడట. కానీ వాళ్ళిద్దరి కంటే వరలక్ష్మీ లో విలనిజం బాగా నచ్చిందని బాలయ్య చెప్పుకొచ్చాడట. పక్కనే ఉన్న వరలక్ష్మి శరత్ కుమార్ ను ఓ రేంజ్ లో పొగడటంతో అక్కడున్న వారంతా చప్పట్లతో జై బాలయ్య అంటూ హోరెత్తించారట. ప్రస్తుతం దీనికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -