Apple: యాపిల్ తిన్న తర్వాత ఆ పదార్థాలు అస్సలు తినకండి?

Apple: ప్రస్తుతం మనం ఉన్న ఈ ఆధునిక కాలంలో మనం తింటున్నది వాటిలో 80% అన్ని కల్తీనే అని చెప్పవచ్చు. కానీ ఎందులో ఎంత మేర క్వాలిటీ ఉంది ఎంత మేర కల్తీ ఉంది అనేది ఎవరికీ తెలియదు. చాలామంది వాటిని పట్టించుకోవడం లేదు. అందుకే వైద్యులు ఆహారం కంటే ఎక్కువగా పండ్లను తీసుకోవాలి అని చెబుతూ ఉంటారు. ఆరోగ్యకరమైన ఆహారం రెండు పూటలా తిని ఒక పూట ఫ్రూట్స్ తిన్న చాలా మంచిది అంటున్నారు నిపుణులు. అయితే రోజు ఒక యాపిల్ తింటే వైద్యుడి దగ్గరికి వెళ్లాల్సిన పనిలేదు అని చెబుతూ ఉంటారు.

యాపిల్ తినడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయన్న సంగతి మనందరికీ తెలిసిందే. యాపిల్ పండు తిన్న తర్వాత కొన్నింటిని అస్సలు తీసుకోకూడదు. మరి యాపిల్ తిన్న తర్వాత ఎటువంటి ఆహార పదార్థాలు తీసుకోకూడదు.. ఒకవేళ తీసుకుంటే ఏం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. యాపిల్ రోజు తీసుకోవడం వలన దంతాలు, ఎముకలు దృఢంగా మారుతాయి. శరీరంలో రక్తహీనత తగ్గుతుంది. ఇందులోని విటమిన్లు, మినరల్స్ మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి.

విటమిన్ సి, బి సిక్స్ విటమిన్లతో పాటు, పొటాషియం, ఫాస్పరస్, మాంగనీస్ వంటి పోషకాలు లభిస్తాయి. యాపిల్ తిన్నాక చాలా మంది భోజనంలో పెరుగు తింటారు. కానీ యాపిల్ తిన్న తర్వాత దాదాపు రెండు గంటల వరకు పెరుగు తినరాదు. ఇలా చేస్తే ఆరోగ్యం దెబ్బతింటుంది. దగ్గు సమస్య కూడా వస్తుంది. అలాగే పచ్చళ్లకు దూరంగా ఉండాలి. యాపిల్స్ తిన్నాక పుల్లని పదార్థాలు, నిమ్మకాయ వంటివి తీసుకోవడం వల్ల గ్యాస్ట్రిక్, ఎసిడిటీ, మలబద్ధకం వంటి సమస్యలు ఉత్పన్నం అవుతాయి. అలాగే నీరు కూడా అధికంగా తీసుకోకూడదు. కడుపులో అపానవాయువు, అజీర్ణానికి కారణమవుతుంది. అలాగే యాపిల్ తిన్న తర్వాత ముల్లంగి అస్సలు తినరాదు. ఇది చర్మ సమస్యలకు దారి తీయవచ్చు. దద్దుర్లు, దురదలకు కారణం అవుతుంది.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: కూటమి విజయాన్ని ఫిక్స్ చేసిన జగన్.. మేనిఫెస్టో హామీలతో బొక్కా బోర్లా పడ్డారా?

CM Jagan: త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో నిర్వహిస్తున్నారు. అయితే వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటూ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు....
- Advertisement -
- Advertisement -