Cricketer: ఆ క్రికెటర్ పై మండిపడుతున్న అభిమానులు.. వరస్ట్ అంటూ?

Cricketer: ఐపీఎల్ 2023 సన్ రైజెస్ హైదరాబాద్ కి మరో ఘోర పరాజయం ఎదురైంది. ఉప్పల్ వేదికగా ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో కేవలం 14 పరుగుల తేడాతో సన్ రైజెస్ హైదరాబాద్ ఘోర పరాజయాన్ని చవి చూసింది. ముంబై ఇండియన్స్ 192 పరుగులకు 193 పరుగులతో సన్ రైజర్స్ హైదరాబాద్ బరిలోకి తెగింది అయితే లక్ష్యాన్ని చేరుకోలేక 178 పరుగులకు ఆల్ అవుట్ అయింది.

ముంబై బౌలర్లలో జాసన్ బెహ్రెండోర్ఫ్, మెరిడిత్‌, చావ్లా తలా రెండు వికెట్లు సాధించగా.. గ్రీన్‌, అర్జున్‌ టెండ్కూలర్‌ చెరో వికెట్‌ సాధించారు. ఇక సన్రైజర్స్ హైదరాబాద్ టీమ్ లో మయాంక్‌ అగర్వాల్‌(48) పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. 193 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఎస్ఆర్ హెచ్ చివరికి ఓటమిని అంగీకరించక తప్పలేదు.

 

ఆఖరి 5 ఓవర్లలో ఎస్‌ఆర్‌హెచ్‌ విజయానికి 60 పరుగులు కావాలి. ఈ సమయంలో సన్‌రైజర్స్‌ ఇంపాక్ట్‌ ప్లేయర్‌గా బరిలోకి దిగిన అబ్దుల్ సమద్ దారుణ ఆట తీరును కనబరిచారు. సమద్ 13 బంతులకు కాను కేవలం 9 పరుగులు చేశారు. ఇక ఆఖరి ఓవర్లో ఎంతో ఉత్కంఠ భరితంగా కొనసాగుతున్న సమయంలో అవసరంలేని పరుగుకు ప్రయత్నించడంతో ఈయన రన్ అవుట్ అయ్యారు. ఇలా ఈయన ఆట తీరుపై ఎస్‌ఆర్‌హెచ్‌ అభిమానులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.

 

ఎస్‌ఆర్‌హెచ్‌ ఇలా ముంబై ఇండియన్స్ చేతిలో ఘోర పరాజయం కావడానికి కారణం సమద్ అంటూ మండిపడుతున్నారు. ఇక ఈయన ఆట తీరు చూసినటువంటి పలువురు అభిమానులు తాను ఐపిఎల్ లో కాకుండా ఐపీఎల్ కు రిజైన్ చేసి ఏదైనా గల్లీలో పోయి ఆటలు ఆడుకో అంటూ పలువురు ఎస్‌ఆర్‌హెచ్‌ అభిమానులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

 

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: ఉప్మాకు అమ్ముడుపోవద్దంటూ పవన్ కళ్యాణ్ సెటైర్లు.. ఆ ఉప్మా ఎవరంటే?

Pawan Kalyan:  ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ పవన్ కళ్యాణ్ తన ప్రచారం లో జోరు, ప్రసంగాలలో హోరు పెంచుతున్నారు. తనదైన స్టైల్ లో ప్రతిపక్షం వారిని విమర్శిస్తూ కూటమి అధికారంలోకి వస్తే...
- Advertisement -
- Advertisement -