Bimbisara: బింబిసార సీక్వెల్ కు దూరం.. వశిష్ట షాకింగ్ కామెంట్స్ వైరల్!

Bimbisara: టాలీవుడ్ నందమూరి హీరో కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన చిత్రం బింబిసార. డైరెక్టర్ వశిష్ట దర్శకత్వం వహించిన ఈ సినిమా 2022లో విడుదల అయ్యి ఎంతటి విజయాన్ని సాధించిందో మనందరికీ తెలిసిందే. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలవడంతో పాటు కలెక్షన్ల వర్షం కురిపించింది. ఇందులో కళ్యాణ్ రామ్ డబుల్ రోల్ లో నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో సంయుక్త మీనన్, కేథరిన్ కు హీరోయిన్ లుగా నటించిన విషయం తెలిసిందే. అయితే బింబిసారా సినిమా చివర్లో ట్విస్టు తో బింబిసారా పార్ట్ 2 పై ఆసక్తిని క్రియేట్ చేశారు మూవీ మేకర్స్.

 

ఇక పార్ట్ టు ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందో అని నందమూరి అభిమానులు, ప్రేక్షకులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తుండగా ఇలాంటి సమయంలోనే దర్శకుడు వశిష్ట ఒక ఊహించని బాంబు పేల్చారు.. బింబిసార పార్ట్ 2 చిత్రం నా దర్శకత్వంలో కాదు. నేను ఆ చిత్రానికి దర్శకత్వం చేయడం లేదు. ఆ మూవీ విషయంలో నా ఊహ వేరుగా ఉంది. అయితే ఈ లోపు నాకు మెగాస్టార్ చిరంజీవి గారితో విశ్వంభర అవకాశం వచ్చింది. విశ్వంభర విషయం కళ్యాణ్ రామ్‌ గారికి కూడా చెప్పాను. ఆయన అనుమతి తీసుకునే బింబిసార పార్ట్ 2 నుండి బయటికి వచ్చాను అని చెబుతూ షాక్ ఇచ్చారు డైరెక్టర్ వశిష్ట.

దీంతో అనేక రకాల అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. బింబిసారా పార్ట్ 2 ని చిరంజీవి విశ్వంభర తర్వాత తెరకెక్కించనున్నారా? అప్పటివరకు ప్రాజెక్టుని హోల్డ్ లో పెడతారా లేక వేరే దర్శకునితో పట్టాలెక్కిస్తారా? లాంటి అనేక రకాల అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రస్తుతం కళ్యాణ్ రామ్ చేతిలో కూడా ఎటువంటి సినిమాలు లేవు. ఇక చిరంజీవి నటిస్తున్న విశ్వంభర సినిమా వచ్చే ఏడాది విడుదల కానుంది. మరి ఆలోపు కళ్యాణ్ రామ్ వేరే సినిమాకు కమిట్ అవుతారా లేదంటే వచ్చే ఏడాది వరకు వెయిట్ చేస్తారా అన్నది చూడాలి మరి.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: కూటమి విజయాన్ని ఫిక్స్ చేసిన జగన్.. మేనిఫెస్టో హామీలతో బొక్కా బోర్లా పడ్డారా?

CM Jagan: త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో నిర్వహిస్తున్నారు. అయితే వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటూ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు....
- Advertisement -
- Advertisement -